పిపిఎ సమీక్షల ఎఫెక్ట్..! జగన్‌పై ఫైరయిన జపాన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రద్దు, సమీక్షల నిర్ణయాలకు అంతర్జాతీయంగా అభిమానులు పెరిగిపోతున్నారు. కేంద్రం ఎంత చెప్పినా వినకుండా.. పీపీఏలను రద్దు చేసే లక్ష్యంతో.. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలో… సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన.. విదేశీ సంస్థలన్నీ… రగిలిపోతున్నాయి. ఓ వైపు.. వివిధ దేశాల రాయబారుల్ని పిలిపించి.. పెట్టుబడులు పెట్టమని జగన్ … సదస్సులు పెడుతూంటే.. మరో వైపు అదే దేశాల నుంచి… తీవ్రమైన నిరసన లేఖలు.. అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి వస్తున్నాయి. పీపీఏల్లో పెట్టుబడుల విషయంలో…గతంలో.. ఫ్రాన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ..కేంద్రానికి లేఖ రాశాయి. తాజాగా… జపాన్ నుంచి.. ఇలాంటి లేఖలు అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి అందాయి.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్షపై జపాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు దౌత్య కార్యాలయం లేఖ రాసింది. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడులపై పునఃసమీక్ష ప్రభావం చూపుతుందని జపాన్ హెచ్చరించింది. ఏపీలోని పీపీఏల్లో జపాన్‌ పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టారని .. ఒకసారి ఖరారైన ఒప్పందాలపై… పునఃసమీక్షలను ఫ్రాన్స్‌, దక్షిణాఫ్రికా, యూరప్‌ దేశాలు గమనిస్తున్నాయని జపాన్ హెచ్చరించారు. జపాన్‌కు చెందిన కంపెనీలు ఎస్‌బీ ఎనర్జీ, రెన్యూ కంపెనీల ఏపీలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. పీపీఏలపై కేంద్రం హెచ్చరికలు రాసినా… ఏపీ సర్కార్ మాత్రం.. రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. దీనిపై పవర్ ట్రిబ్యునల్ లో విచారణ జరుగుతోంది.

మరో వైపు.. పోలవరం ప్రాజెక్ట్ గేట్ల కాంట్రాక్ట్ ఫ్రాన్స్ కు చెందిన బెకం కంపెనీ చేస్తోంది. ఆ కంపెనీని మధ్యలోనే వెళ్లిపోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. దీనిపై ఫ్రాన్స్ నుంచి లేఖలు అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వివిధ దేశాల నుంచి…. ప్రత్యేకమైన గుర్తింపును ఎప్పటికప్పుడు తెచ్చుకుంటున్నారు. కానీ.. అది ఆయన కోరుకుంటున్న పెట్టుబడుల దారిలో మాత్రం లేరు.. వేరుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close