జేసీ దివాకర్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నారా

హైదరాబాద్: తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. చంద్రబాబుకు కోపం, తాపం ఏమీలేవని, కాబట్టి ఆయన ఔట్‌డేటెడ్‌ పొలిటీషియనేనని, తమవాడు జగనేమో గయ్‌మని లేస్తున్నాడని, కోపం ఉందికాబట్టి లేటెస్ట్ పొలిటిషియనేనని చెప్పారు. జగన్ తమవాడేనని అన్నారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వైసీపీలో చేరబోతున్నారా అని అక్కడున్న రిపోర్టర్‌లకందరికీ సందేహం కలిగింది.

జేసీ దివాకరరెడ్డి ఇలా పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేయటం చాలా రోజులనుంచి జరుగుతోంది. ప్రత్యేకహోదా రాదని,అది చంద్రబాబుతోసహా తమపార్టీలోని అందరికీ తెలుసని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఒకపక్క ప్రత్యేకహోదాపై పార్టీ నాయకత్వం జనానికి సమాధానం చెప్పలేక సతమతమవుతూ ఉంటే జేసీ ఇలా చెప్పటం పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆయనకు ఎందుకనో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇవాళకూడా ఏపీకి ప్రత్యేకహోదా రాదని జేసీ అసెంబ్లీ మీడియా పాయింట్‌వద్ద చెప్పారు. మరి ఇలా చెప్పటంలో ఆయన ఆంతర్యం ఏమిటో అర్థంకావటంలేదు. ఇదేమైనా శల్యసారథ్యమా అని అందరూ అనుకుంటున్నారు.

జేసీ ఇలా తనకు తోచింది తోచినట్లు, ఎవరినీ లెక్కచేయనట్లు మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలో 2004లో వైఎస్ క్యాబినెట్‍‌లో మంత్రిగా ఉన్న సమయంలోకూడా ఇలాగే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండేవారు. అది గుర్తుపెట్టుకున్న వైఎస్, 2009లో ఈయనకు మంత్రిపదవి ఇవ్వకుండా తొక్కేశారు. తనకు మంత్రిపదవి ఇవ్వకపోవటంపై జేసీ అప్పట్లో మీడియాముందు తెగ వాపోయేవారు. ఇక ఈయన తమ్ముడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి గురించి చెప్పనవసరంలేదు. ఒకసారి తమ ట్రావెల్స్‌కు చెందిన బస్సులకు పర్మిట్‌లపై ఏదో తేడా వచ్చి హైదరాబాద్‌లోని ఆర్‌టీఓ కార్యాలయంలోకి తన మందీ మార్బలంతో దూసుకెళ్ళి, ఉన్నతాధికారి గాంధీని కులంపేరుపెట్టి దుర్భాషలాడారు. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఉందికాబట్టి నడిచిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close