చిత్తుగా ఓడిపోయి ఏడాది అయింది. ఇప్పటికీ ప్రజల్లో సానుభూతి లేదు. ఏ మాత్రం అర్థం చేసుకోకుండా ఇంకా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా మారకపోతే జగన్ రెడ్డికి కష్టమే అని సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చేశారు. తాను టీడీపీ నేతగా కాకుండా.. వైఎస్ విజయమ్మ ముఖం చూసి ఇలా సలహాలిస్తున్నానని చెప్పుకచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే మారాడని గుర్తు చేశారు.
ముఖ్యంగా ఏ విషయంలో మారాలి అంటే..జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కటే చెబుతున్నారు. బెదిరింపులు. జగన్ రెడ్డి మళ్లీ వస్తాడో రాడో కానీ వస్తే అది చేస్తా.. ఇది చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీని వల్ల ఆయన అంటే సామాన్య జనం ఇంకా ఇంకా భయపడుతున్నారు. ఇదే విషయాన్ని జేసీ ప్రబాకర్ రెడ్డి చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం.. జగనన్న ఏది చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి మారాలని .. సహజ సిద్ధమైన ప్రజల్ని ఆకట్టుకునే రాజకీయం చేయాలని అనుకుంటారు.కానీ చంద్రబాబును తిడితే.. చంద్రబాబుపై వ్యతిరేకత పెంచితే .. చచ్చినట్లుగా ప్రజలు తనకే ఓటేస్తారన్నట్లుగా జగన్ రాజకీయం ఉంటోంది. కుల, మత చిచ్చు పెట్టి చేసే రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రతీ సారి అది సాధ్యం కాదని అర్థం చేసుకోలేకపోతున్నారు.