ఆర్ ఆర్ ఆర్ ముందు చతికిలపడ్డ జాన్ అబ్రహం అటాక్

నిన్న విడుదలైన జాన్ అబ్రహం సినిమా అటాక్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు పూర్తిగా చతికిలపడ్డట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా ని కించపరుస్తూ ఇటీవల జాన్ అబ్రహం వ్యాఖ్యలు:

నిజానికి పాన్ ఇండియా స్థాయిలో రాజమౌళి రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ని జాన్ అబ్రహం ఎటాక్ సినిమాతో పోల్చ వలసిన అవసరం వచ్చేది కాదు. కానీ నాలుగు రోజుల కిందట జాన్ అబ్రహం తెలుగు సినిమాను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో అటాక్ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్న అంశంపై సినీ పరిశీలకులు దృష్టి సారించారు. జాన్ అబ్రహం అటాక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, బాలీవుడ్ సినిమా ఏ ప్రాంతీయ సినిమా కంటే తక్కువ కాదని, బాలీవుడ్ పరిశ్రమ నంబర్ టు స్థానంలో ఉన్న పరిశ్రమ కాదని వ్యాఖ్యానించారు. సలార్ సినిమా లో ప్రభాస్ తో పాటు మీరు కూడా నటిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించినపుడు సెకండ్ హీరోగా నటించడానికి తాను ప్రాంతీయ సినిమా నటుడు కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయి. గతంలో బాహుబలి సినిమా విడుదల సమయంలో పద్మావతి చిత్ర యూనిట్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జాన్ అబ్రహం అటాక్ సినిమా ఇప్పటికే థియేటర్లలో వీరవిహారం చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా దెబ్బకు కుదేలు అవుతుందన్న భయంతోనే జాన్ అబ్రహం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని విశ్లేషణ లు వినిపించాయి. పైగా అటాక్ సినిమా నిర్మాతలలో జాన్ అబ్రహం కూడా ఒకరు. దీనికితోడు సత్యమేవ జయతే 2 వంటి ఘోరమైన ఫ్లాపుల తర్వాత జాన్ అబ్రహం నుండి వస్తున్న సినిమా కావడంతో ఒత్తిడి కారణంగా ఈ వ్యాఖ్యలు జాన్ అబ్రహం చేసి ఉంటాడని విశ్లేషణలు వినిపించాయి.

యావరేజ్ రేటింగ్, ఎవరేజ్ టాక్ సంపాదించుకున్న అటాక్:

మొత్తం మీద నిన్న అటాక్ సినిమా తెర ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ సినిమా కి సమీక్షకులు యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. పోనీ, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసం రూపొందిన ఈ సినిమాకు వారి నుండి అయినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా అనుకుంటే అదీ లేదు. ఈ సినిమాలోని ఏ ఏ సీన్లు ఏ ఏ హాలీవుడ్ సినిమా సన్నివేశాల ప్రేరణ తో రూపొందాయో వారు సినిమాలోని సీన్ లను ఒరిజినల్ హాలీవుడ్ సినీ మూలాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. దీంతో అటు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ లో సైతం ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం లేదు.

అటాక్ మొదటి రోజు కలెక్షన్లు, ఆర్ ఆర్ ఆర్ ఎనిమిదవ రోజు కలెక్షన్ లలో 1/3 వంతు:

సరే , కొన్నిసార్లు సమీక్షకులు తక్కువ రేటింగ్ ఇచ్చినా, మల్టీ ప్లక్స్ ఆడియన్స్ పట్టించుకోకపోయినా సినిమాకు మంచి ఓపెనింగ్స్ కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు గతంలో చాలా సార్లు చూశాం. అయితే ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ రిపోర్ట్స్ బట్టి చూస్తే అటాక్ సినిమాకు విడుదలైన మొదటి రోజున దాదాపు మూడు కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. అయితే ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదలైన ఎనిమిదవ రోజు అయిన అదే రోజున ఆర్ఆర్ఆర్ సినిమాకు దీనికి దాదాపు మూడు రెట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం.

ఏది ఏమైనా ఆర్.ఆర్ సినిమాపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం ద్వారా తన మీద ప్రాంతీయ సినిమా ఆడియన్స్ లో ఉన్న సదభిప్రాయాన్ని పూర్తిగా పాడు చేసుకున్న జాన్ అబ్రహం కి అటు ఫలం దక్కక పోవడంతో పాటు ఇటు వ్రతం కూడా చెడినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు. జాన్ అబ్రహం వ్యాఖ్యలతో నొచ్చుకున్న కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి, అసలు ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా పలకకుండా రెండు దశాబ్దాలు నటనా కెరీర్ ని నెట్టుకొని వచ్చిన జాన్ అబ్రహం కనీసం ఇప్పుడైనా యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకోవాలని, ఆ ఓనమాలు నేర్చుకున్న తర్వాత ఇతర భాషల సినిమాలలో నటించడం గురించి ఆలోచించవచ్చు అని హితవు పలుకుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close