కమల్ విశ్వరూపంలో “గాడ్సే” మొదటి హిందూ టెర్రరిస్ట్..!

“మక్కల్ నీది మయ్యం” పార్టీ అధినేత … తన విశ్వరూపాన్ని ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్నారు. తమిళనాడులో 19వ తేదీన జరగనున్న మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో… గాడ్సే ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయనను.. స్వతంత్ర బారతదేశపు తొలి టెర్రరిస్ట్‌గా అభివర్ణించారు. హిందూ ఉగ్రవాదిగా ఆయన గాంధీని హత్య చేశాడన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా అభివర్ణించుకుని… తనకు అలా హక్కు ఉందన్నారు. గాంధీ హంతకుడిగా … దేశ ప్రజల దృష్టిలో విలన్‌గా ఉన్న గాడ్సేను.. హిందూ ఉగ్రవాదిగా.,.. కమల్ హాసన్ అభివర్ణించడం రాజకీయంగా కలకలం సృష్టించే అవకాశం ఉంది.

“గాడ్సే” మొదటి హిందూ టెర్రరిస్ట్ అంటే బీజేపీకి కాలుతుందా..?

భారతీయ జనతా పార్టీకొద్ది రోజులుగా హిందూ ఉగ్రవాదంపై మాట్లాడుతోంది. అలాంటి వాళ్లెవరూ లేరని .. ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న… సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కి… భోపాల్ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఆమెను అన్యాయంగా ఇరికించారని ప్రచారం చేశారు. ఈ క్రమంలో… కమల్ హాసన్.. హిందూ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేయడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే… గాంధీ మహాత్ముడి ప్రాణాలు తీసుకున్న నాథూరాం గాడ్సే.. ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తేనని.. ప్రచారంలో ఉంది. అదే సమయంలో.. ఆరెస్సెస్ వర్గీయులు.. గాంధీ కన్నా.. గాడ్సేనే ఎక్కువగా అభిమానిస్తారు. గాడ్సే విగ్రహానికి.. మోడీ స్వయంగా… నివాళులు అర్పిస్తున్న ఫోటోలు… ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి.

మహాత్ముడిని గాడ్సే చంపడానికి కారణాలు మత పరమైనవే..!

మహాత్ముడిని.. గాడ్సే కాల్చి చంపడం వెనుక నేపధ్యం కూడా… మతమేనని ప్రచారంలో ఉంది. దేశ విభజన అనంతర పరిణామాల్లో గాంధీ తీసుకున్న నిర్ణయాలను… గాడ్సే వ్యతిరేకించారని.. మత పర కారణాలతోనే.. గాడ్సే ఉన్మాదిగా మారారన్న ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అయితే.. ఇంత వరకూ.. ఎవరూ గాడ్సేపై టెర్రరిస్ట్ అనే ముద్ర వేయలేదు. మొదటి సారి కమల్ హాసన్ ఆ పని చేశారు. గాడ్సేను… స్వతంత్ర భారత దేశంలో.. మొట్టమొదటి… హిందూ టెర్రరిస్ట్‌గా అభివర్ణించి.. కలకలం రేపారు. ఇది సహజంగానే భారతీయ జనతా పార్టీ నేతలకు నచ్చదు. ఆ పార్టీ జాతీయవాద భావాలున్న వారికి అసలు నచ్చదు.

గాడ్సేను ఆరాధించినా ఖండించలేని స్థితిలో బీజేపీ..!

అయితే.. కమల్ హాసన్.. అత్యంత వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి. ఎందుకంటే… భారతీయ జనతా పార్టీ కూడా.. బహిరంగంగా.. నాథూరాం గాడ్సేను వెనకేసుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే మహాత్ముడిపై… అంతంతమాత్రం అభిమానం చూపిస్తుందని విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ.. ఇప్పుడు.. కమల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తే మరింత ఇరకాటంలో పడుతుంది. అందుకే..గాడ్సేను… బీజేపీ వెనుకేసుకు రావడం కష్టం. అయితే హిందూ ఉగ్రవాది అన్న విషయంలో మాత్రం… కాస్త అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. హిందూత్వం అంటే… తాము ఆచరించేదే అనే భావనలు ఉన్న వాళ్లు. కమల్‌పై విమర్శలతో ఎటా చేసే అవకాశం ఉంది. అయితే కమల్ మాత్రం.. ఓ హాట్ టాపిక్‌ను.. ఎన్నికల చివరి దశలో.. తెరపైకి తెచ్చారన్నది మాత్రం స్పష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close