జగన్ పై హత్య కేసు నమోదు చేయాలన్న కన్నా లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై హత్య కేసు నమోదు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పడవ ప్రమాదాలు జరిగినప్పుడు, చంద్రబాబు మీద హత్య కేసు నమోదు చేయాలని వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిద్ర పోతుందా అంటూ జగన్ తీవ్ర స్వరంతో విరుచుకుపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార హ్యాండిల్ నుంచి, చంద్రబాబు పై హత్య కేసు నమోదు చేయాలని జగన్ వ్యాఖ్యానించినట్లు ట్వీట్ కూడా చేశారు.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అదే తరహా బోటు ప్రమాదం జరిగింది. ఇప్పుడు కూడా అదే అవినీతి, అదే నిర్లక్ష్యం కారణంగానే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, గతంలో చంద్రబాబు మీద హత్య కేసు పెట్టాలన్న వైఎస్ఆర్సిపి ట్వీట్ ని కూడా జత‌ చేస్తూ, “మీ ప్రభుత్వం వైఫల్యం వల్లే పడవ ప్రమాదం జరిగింది.. మీ పైన కూడా హత్యా కేసు నమోదు చెయ్యాలి.. మీ ప్రభుత్వం ఈ దారుణానికి ఖచ్చితంగా నైతికంగా బాధ్యత తీసుకోవాలి.. దీనికి ఏమంటారు జగన్ గారు ?” – అంటూ ట్వీట్ చేశారు. అప్పట్లో పడవ ప్రమాదాలకు చంద్రబాబు ప్రభుత్వం కారణం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హత్య కేసు నమోదు చేయాలనే జగన్ వాదన సరైనదైతే, ఇప్పుడు అదే లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి జగన్ పై హత్య కేసు నమోదు చేయాల్సి ఉంటుందని తటస్థులు కూడా అభిప్రాయపడుతున్నారు.

బిజెపి నేతలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, వారి విమర్శలు తిప్పికొట్టే సాహసం చేయడానికి వెనకాడుతున్న వైఎస్ఆర్ సీపీ నేతలు, మరి ఈసారైనా కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యల మీద స్పందిస్తారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close