కేసీఆర్ రుణమాఫీ రేపట్నుంచే !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాదికోసారి ఇదిగో రుణమాఫీ అంటూంటారు. వచ్చే ఏడాది అలా అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే రుణమాఫీ హామీ ఇచ్చి ఐదేళ్లు అవుతోంది. మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. రైతుల ఆగ్రహం ఊహించనంతగా ఉందని అర్థమైయిందేమో కానీ వెంటనే రుణమాఫీ హామీని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. గురువారం నుంచి రైతు రుణమాఫీ పునఃప్రారంభం అవుతుందని ప్రకటించారు. గతంలో కొంత మందికి రుణమాఫీ చేశామని ఇంకా రూ. 19 వేల కోట్లు మాత్రమే పెండింగ్ ఉందని ఇది వచ్చే నెల రెండో వారానికల్లా పూర్తి చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు.

ఇంత కాలం ఎందుకు ఆలస్యం అయిందంటే.. బీజేపీ వల్లేనంటున్నారు కేసీఆర్. కేంద్రం తీరువల్లే రుణమాఫీ ఆలస్యం అయిందని కేసీఆర్ ఆరోపించారు. ఎఫ్ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోతపెట్టింది. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరిగిందన్నారు. మరో రూ.19 వేల కోట్లు రైతులకు అందించాల్సి ఉంది.సెప్టెంబర్‌ 2వ వారం లోపు రుణమాఫీ పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికిప్పుడు నెలలో రుణమాఫీకే 19 వేల కోట్ల రూపాయలు సమీకరించాల్సి ఉంది. ఇది ఒక్క రుణమాఫీకే. ఇంకా దళిత బందు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతో లక్షలు పంచాల్సిన పథకాలు ఉన్నాయి. కనీసం చ్చే నెలలో జీతభత్యాలు కాకుండానే పాతిక వేల కోట్లు అవసరం మరి. కేంద్రం ఇప్పుడు కనికరించి.. ఎక్కువ అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందేమో కానీ.. కేసీఆర్ మాత్రం. రుణమాఫీ హామీని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close