అసెంబ్లీలోనూ మోదీ టార్గెట్‌గా కేసీఆర్ స్పీచ్ !

కేసీఆర్ ఏ సందర్భంలో మాట్లాడినా .. మోడీకి, కేంద్రానికి అన్వయించి తెలంగాణకు.. దేశానికి తీవ్ర అన్యాయం చేశారని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు .రెండురోజుల పాటు నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో .. కేసీఆర్ తొలి రోజే దాదాపుగా రెండు గంటలకుపైగా ప్రసంగించారు. ఈ ప్రసంగం మొత్తం మోదీని విమర్శించడానికి.., తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసింది చెప్పడంతో పాటు దేశానికి మోదీ ఎలా నష్టం చేశారు.. అలాగే తనతో సఖ్యతగా ఉన్న సీఎంలు ఉన్న రాష్ట్రాలకూ ఎలా అన్యాయం చేశారో కూడా కేసీఆర్ వివరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ప్రతీ సందర్భంలోనూ తెలంగాణ లింక్ పెట్టుకున్నారు.

తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని చెప్పడానికి ఏడుమండలాల దగ్గర్నుంచి ప్రారంభించారు. చంద్రబాబు చేతిలో కీలబొమ్మగా మారి ఏడు మండలాలను గుంజుకున్నారని విమర్శించారు. ఇప్పుడు కరెంట్ బకాయిల పేరుతో ప్రపంచంలో లేనంత వడ్డీ వేసి కట్టమని ఆదేశించారని.. మరి తెలంగామకు ఇవ్వాల్సిన వాటి గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇలాంటి ఆదేశాలివ్వడానకి మోదీ ఎవరి చేతిలో కీలుబొమ్మ అయ్యారో కేసీఆర్ చెప్పలేదు. తెలంగాణ విషయంలో గతంలో చెబుతున్న అన్ని విషయాలను మరోసారి శాసనసభా వేదికగాకేసీఆర్ వివరించారు.పనిలో పనిగా బీహార్ కూడా పాజిటివ్ మాటు చెప్పారు. బీహార్ అంటే బీమారీ రాష్ట్రం కాదని అక్కడ విద్యుత్ ప్రాజెక్టులువస్తే ఆ రాష్ట్రం దశ మారిపోతుందన్నారు.

వ్యవసాయం తన వల్ల కాదని రైతులు చేతులెత్తేసేలా కేంద్రం కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. లక్షల కోట్ల ఆస్తులు అమ్ముతున్నారని… అదానీ లాంటి వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు వారికి పోయే కాలం వచ్చింది. షిండేలు, బొండేలు ఎంత మంది వచ్చినా ఇక్కడ ఎవరు భయపడరు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడని గుర్తు చేశారు. మొత్తంగా కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల మిషన్ మోడ్‌లో ఉన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆరు నెలల్లోపు సభ నర్వహించాల్సి ఉండటంతో సమావేశపర్చిన కేసీఆర్..ఆ సమావేశాల్లోనూ .. తన జాతీయ అజెండా మేరకే ప్రసంగించారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close