కొత్త ఇంట్లోకి కేసీఆర్: ముహూర్తం ఖరారు

తెలంగాణలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికే విశాలమైన అధికారిక నివాసం ఉన్నప్పటికీ, మరింత అధునాతన అధికారిక భవనంలోకి మారబోతున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. దసరా నాడు ఆయన లాంఛనంగా గృహప్రవేశం చేయబోతున్నారు. ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి.

గ్రీన్ లాండ్స్ లో ఇప్పుడున్న సీఎం క్యాంప్ ఆఫీసు వెనుకే కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. 10 ఎకరాల విస్తీర్ణం అధికారిక నివాస సముదాయం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రెండెకరాల స్థలంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంటుంది. మిగతా స్థలంలో ఆడిటోరియం కాన్ఫరెన్స్ హాలు, సిబ్బంది క్వార్టర్లు వగైరా నిర్మిస్తున్నారు.

సుమారు 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి మార్చి నెలలో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సముదాయంలో 250 సీట్ల మల్టీ పర్పస్ ఆడిటోరియం నిర్మిస్తున్నారు. అది కాకుండా 100 సీట్ల సామర్థ్యం గల కాన్ఫరెన్స్ హాలు నిర్మాణం జరుగుతోంది.

ప్రస్తుత క్యాంప్ఆఫీస్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించారు. 2005 లో సుమారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాస్తు పేరుతో మార్పులు చేర్పులకు మరో 10 కోట్ల వరకూ ఖర్చయింది.

అయినా. కొత్తగా క్యాంప్ ఆఫీస్ కావాలని కేసీఆర్ భావించారు. దీనికి 35 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తొలి అంచనా. అయితేపనులు పూర్తయ్యే నాటికి ఖర్చు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఎప్పుడు నెరవేరుతుందనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. హైదరాబాద్ లో ఒక్క చోట మాత్రం ఓ ఇళ్ల సముదాయాన్ని పూర్తి చేశారు.
మిగిలిన పేదలకు సొంత ఇంటికల నెరవేర్చడానికి ప్లాన్ చేయడం, చర్చలు జరపడం అంతా జరిగిపోతోంది. కానీ ఇళ్ల పనిమాత్రం మొదలుకాలేదు. ముఖ్యమంత్రికి మాత్రం లంకంత క్యాంప్ ఆఫీస్ ఉన్నా, ప్రజల డబ్బుతో మరో అధునాతన భవంతి అందుబాటులోకి రాబోతోంది. అన్నట్టు… దీన్ని పక్కా వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close