తెరాస ఏమి చేసినా తప్పు కాదు..అది బంగారి తెలంగాణా కోసమేనట!

ఒకప్పుడు ఉద్యమ నాయకులతో నిండిన తెరాస, ఇప్పుడు కాంగ్రెస్, తెదేపా నేతలతో నిండిపోయి దాని అసలు స్వరూపమే పూర్తిగా కోల్పోయింది. ఒకప్పుడు కేవలం తెలంగాణా సాధన కోసమే ఆలోచించిన తెరాస, ఇప్పుడు వరుసగా వస్తున్న ఎన్నికలలో విజయం సాధించడం, దాని కోసం ప్రతిపక్ష పార్టీల నేతల ఫిరాయింపుల గురించే ఎక్కువగా ఆలోచిస్తోందనే అభిప్రాయం, అసంతృప్తి పార్టీలో, ప్రజలలో కూడా వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాల విమర్శలు సరేసరి.
మాటల మాంత్రికుడుగ పేరొందిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విమర్శలకు ధీటుగా జవాబు చెప్పడమే కాకుండా, తన అప్రజాస్వామిక కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సమర్ధించుకోవడం విశేషం.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఖమ్మం జిల్లాకు చెందిన మరికొంత మంది ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను నిన్న తెరాసలో చేర్చుకొంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను వింటే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమాత్రం తప్పు కాదనే అభిప్రాయం కలుగుతుంది. అంత చక్కగా ఆయన తన తప్పును సమర్ధించుకొన్నారు.

ఆ సందర్భంగా పార్టీ నేతలని, కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఇతర పార్టీల నుంచి నేతలు, ప్రజా ప్రతినిధులు తెరాసలో చేరడాన్ని రాజకీయ శక్తుల పునరేకీకరణ చూడాలి తప్ప చిల్లర మల్లర రాజకీయ చేరికలుగా చూడరాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా బంగారి తెలంగాణా సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలే. తెలంగాణాలో రాజకీయ శక్తుల పునరేకీకరణ చారిత్రిక అవసరం. మనం తెలంగాణా అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటే, రాష్ట్రానికే చెందిన కొందరు నోటికి వచ్చినట్లు ఏదేదో వాగుతుంటారు. అటువంటివారిని మనం పట్టించుకోనవసరం లేదు. ఈ ముక్క నేను చెప్పింది కాదు ప్రజలే చెప్పారు. బంగారి తెలంగాణా సాధనే లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందుకు సాగిపోదాము. మనతో వచ్చే వాళ్ళు వస్తారు రానివాళ్ళ సంగతి ప్రజలే చూసుకొంటారు. భవిష్యత్ తరాలకు ఏమాత్రం నష్టం జరగకుండా మనం చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటూ, రాష్ట్రాభివృద్ధి చేసుకొంటున్నాము. ఇప్పటి వరకు మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేయగలిగితే మన రాష్ట్రం రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి. అందుకోసం పార్టీలో అందరూ సమిష్టి కృషి చేయాలి,” అని కేసీఆర్ అన్నారు.
తెలంగాణా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ఎవరూ ఆక్షేపించలేరు కానీ ‘భవిష్యత్ తరాలకు నష్టం’ జరగకుండా ఉండటానికి ఆయన వలసలను ప్రోత్సహించుతూ, దానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ అనే గంభీరమయిన పేరు పెట్టడం, అది తప్పు కాదన్నట్లుగా వాదించడం, పైగా తమ పార్టీలో చేరనివారు రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడటం సరికాదు. ఆయన తన మాటకారితనంతో తను చేస్తున్న అప్రజాస్వామిక పనులకు అందంగా సర్ది చెప్పుకోవచ్చు కానీ అంతమాత్రన్న అవి తప్పులు కాకుండాపోవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close