కియా మోటార్స్ తెచ్చింది చనిపోయిన వైఎస్..!

అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ఎవరు తెచ్చారు..?. ఈ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ నేతలు … మా చంద్రబాబు అని మరో మాట లేకుండా చెప్పుకుంటారు. అదే వైసీపీ వాళ్లయితే… నిన్నటి వరకు.. ఇంకా చెప్పాలంటే.. ఈ రోజు ఉదయం.. అసలు రహస్యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టనంత వరకూ… ప్రధాని మోడీ తెచ్చారని ప్రచారం చేస్తూ ఉంటారు., కానీ.. అసలు రహస్యాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టేశారు. అసలు.. కియా మోటార్స్ తీసుకొచ్చింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనే స్వయంగా ప్రయత్నాలు చేయడం వల్లే కియా మోటార్స్ వచ్చిందట. ఈ విషయాన్ని కియా మోటార్స్ ప్రతినిధులే.. ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారట.

ఎన్నికల ప్రచారంలో.., జగన్మోహన్ రెడ్డి అనంతపురం వెళ్లారు. కియా పరిశ్రమ ఉన్న పెనుగొండకు కూడా వెళ్లారు. అక్కడ ఆయన … తన తండ్రి వైఎస్ వల్ల కియా పరిశ్రమ వచ్చిందని చెప్పలేదు. కానీ… ఆ క్రెడిట్‌ను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కాక… నరేంద్రమోడీకి ఇచ్చారు. నరేంద్రమోడీ వల్లే ఏపీకి కియా మోటార్స్ వచ్చిందని ప్రకటించారు. అంటే.. దాదాపుగా పదేళ్ల కిందట చనిపోయిన తన తండ్రిని క్రెడిట్ ఇవ్వడానికి ఆయనకు కూడా మనసొప్పలేదు. ఇప్పుడు మాత్రం.. అసెంబ్లీ సాక్షిగా… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్‌కి క్రెడిట్ ఇచ్చేశారు.

కియా మోటార్స్‌కు ఏపీ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పుడు.. వైఎస్ జీవించి ఉన్నారా.. లేదా … అన్నది తర్వాతి విషయం ముందుగా తమ పార్టీకి మూలపురుషుడైన.. వైఎస్‌కు..ఎక్కడ లేని క్రెడిట్ ఇవ్వడానికి.. వైసీపీ మంత్రి తాపత్రయపడిపోయారు. సొంత పార్టీ వాళ్లు నమ్మినా .. నమ్మకపోయినా.. అన్నింటిలాగే.. దాన్ని కూడా ప్రచారం చేసుకుంటారని.. భావించారేమో కానీ.., సామాన్యుల దృష్టిలో మాత్రం.. మరీ కామెడీ అయిపోతుంది. అంతగా వైఎస్ వల్ల కియా పరిశ్రమ వచ్చిందనుకుంటే.. ఆయన ప్రభుత్వ హయాంలో.. కనీసం.. ఓ ప్రతిపాదన లేఖ పంపినట్లుగా అయినా… ఓ పత్రాన్ని బుగ్గన విడుదల చేసి ఉండాల్సింది. కియా ప్రతినిధులే లేఖ రాశారంటూ.. కొత్తగా… ఆయన.. సాక్ష్యం తీసుకొచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close