తెదేపా నేతలకి షాక్: హరికృష్ణ కారులో కొడాలి నాని!!!

విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ పశువుల ఆసుపత్రికి ఇవ్వాళ్ళ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ, స్థానిక తెదేపా నేతలు, కార్యకర్తలు చాల భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇంతవరకే అయితే అందులో విశేషమేమీ లేదు. కానీ నందమూరి హరికృష్ణ కారులో నుంచి గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని కూడా దిగడంతో అందరూ షాక్ అయ్యారు. అంతే కాదు..ఆయనతో బాటు దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం మరో విశేషం. దేవినేని అవినాష్ త్వరలో తెదేపా చేరడానికి నిశ్చయించుకొన్నట్లు తాజా సమాచారం. తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొడాలి నాని, ఈ కార్యక్రమానికి హరికృష్ణ కారులోనే రావడంతో ఆయన కూడా త్వరలోనే మళ్ళీ తెదేపాలోకి తిరిగి వచ్చేయబోతున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొడాలి నానికి నందమూరి కుటుంబంలో హరికృష్ణతో ఆయన కుమారుడు జూ.ఎన్టీఆర్ తో నేటికీ సత్సంబందాలే ఉన్నాయి. కనుక హరికృష్ణ చొరవ తీసుకొని కొడాలి నానిని మళ్ళీ తెదేపాలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారేమోననే అనుమానం కలుగుతోంది. అయితే తను కేవలం హరికృష్ణ మీద అభిమానంతో ఆయనను కలిసేందుకే వచ్చేనని కొడాలి నాని చెప్పారు. తన రాకకు ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని స్పష్టం చేసారు. కానీ సాధారణంగా ఎవరయినా పార్టీ మారే ముందే ఈవిధంగా బయటపడుతుంటారు కనుక కొడాలి నాని కూడా త్వరలోనే వైకాపా నుంచి జంప్ అయిపోతారేమో? ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇది మరో పెద్ద షాక్ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close