బీజేపీ – వైసీపీ మరింత దగ్గర చేస్తున్న కోడికత్తి..!

వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు.. కోడికత్తి కేసులో సేమ్ టు సేమ్ వాదన వినిపించడం ప్రారంభించాయి. కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లడంతో.. ఆ రెండు పార్టీల నేతలు… టీడీపీ టార్గెట్ గా ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఒకే వాదన వినిపించడం ప్రారంభించారు. నేరుగా కోడికత్తి కేసుతో చంద్రబాబుకు ప్రమేయం ఉందని… అందుకే… ఎన్ఐఏ కేసు విచారణను వ్యతిరేకిస్తున్నారంటూ… చెప్పుకొస్తున్నారు. ఢిల్లీలో ఈ అంశంపైనే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన .. బీజేపీ ఏపీ అగ్రనేతలు అనదగ్గ.. కన్నా, జీవీఎల్ సహా ఇతర నేతలు… ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు. అదేదో కోడికత్తిని చంద్రబాబు… నిందితుడికి ఇచ్చినట్లుగా… వారు తీర్మానించేశారు. కచ్చితంగా ఇది వైసీపీ చేస్తున్న వాదనకు వంద కు వంద శాతం సూటవుతుంది.

ఇక.. ఏపీలో వైసీపీ నేతలు.. ఈ విషయంలో చాలా రోజుల నుంచి అదే వాదన వినిపిస్తున్నారు. తమదైన కథ ను.. సాక్షి పత్రిక వేదికగా… ప్రచారం చేస్తున్నారు. ఏపి పోలీసుల తీరుపై నమ్మకం లేదని చెబుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కావాలనే డిమాండ్ వినిపించారు. కోర్టు ఆదేశిస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ముందుగానే… కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఎన్ ఐ ఏ తో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. వైసీపీ కోరికను కేంద్రహోంమంత్రిత్వ శాఖ అలా తీర్చింది. వైసీపీకి కావాల్సింది ఇదే కాబట్టి… ఆ పార్టీ తన మీడియా ద్వారా వీలైనంతగా… ఈ కేసులో టీడీపీకి కలిపేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పదే పదే కథనాలు ప్రచురిస్తోంది. ఎన్ ఐ ఏ ఎలా విచారణ చేయాలో కూడా పత్రికా ముఖంగా సూచనలు చేసింది.

మొత్తానికి ఇంత కాలం.. రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఉన్న సంబంధాలు.. కోడికత్తి కేసుతో… బహిరంగం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయగలికిన స్థాయిలో ఉన్న బీజేపీ… అదే కోరుకుంటున్న వైసీపీ పట్టు బట్టి కూడబలుక్కుని ఒకే తరహా ఆరోపణలు చేస్తున్నాయి. ఇది రాజకీయంగా వారిని మరింత దగ్గర చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దగ్గరి తనం ఎక్కడి వరకూ వెళ్తుందో… అది లోపాయికారీగానో ఉంటుందో… మరో నెలలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close