మళ్లీ చంద్రబాబును కలిసిన కొణతాల రామకృష్ణ..!

ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. వైసీపీలో చేరేందుకు.. లోటస్‌పాండ్‌కు వెళ్లి మరీ వెనక్కి వచ్చేసిన కొణతాల… మళ్లీ చంద్రబాబును కలిశారు. ఆయన ఏ పార్టీలో చేరాలన్నదానిపై ఇంత వరకూ.. ఏ నిర్ణయానికి రాలేకపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేశారు. అనకాపల్లి నుంచి తన సోదరుడ్ని బరిలోకి దింపారు. ఆయన ఓడిపోయారు. విశాఖలో పోటీ చేసిన విజయమ్మ బాధ్యత తీసుకుని ఫెయిలయ్యారు. దాంతో జగన్‌తో దూరం పెరిగింది. ఆ తర్వాత అవమానాలు తట్టుకోలేక.. లేఖలు సంధించారు. ఈ కారణంగా.. జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర చర్చా వేదిక పెట్టి… రాజకీయాల్లో వెనుకబడకుండా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆయన టీడీపీకి దగ్గరయ్యారు.

రెండు, మూడు సార్లు టీడీపీ అధినేతతో గతంలో సమావేశం అయ్యారు. పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ… టిక్కెట్ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ముందుగా పార్టీలో చేరమని సూచించారు. కానీ.. కొణతాలకు గ్యారంటీ లేకపోవడంతో.. వెనక్కి తగ్గారు. ఈ లోపు… అనకాపల్లి లోక్ సభ నుంచి… టీడీపీ తరపున అడాలి ఆనంద్ అనే నేతను ఖరారు చేసినట్లు పత్రికల్లో రావడంతో.. తనకు అవకాశం రాదనుకుని వైసీపీ వైపు చూశారు. కానీ అక్కడా కండువా కప్పించుకోలేకపోయారు. తన సస్పెన్షన్ ఎత్తి వేయాలని జగన్ ను అడిగితే.. తర్వాత చుద్దామన్నారని.. ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే… కొణతాల నొచ్చుకున్నారంటున్నారు.

చంద్రబాబు… కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ.. దాదాపుగా కసరత్తు అయితే పూర్తి చేశారు. అభ్యర్థులను ఖరారు చేశారు. సర్ది చెప్పాల్సిన నేతలు, సమీకరణాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో… కొణతాల మళ్లీ టీడీపీ అధినేతను కలిశారు. ఆయనకు చంద్రబాబు చాన్సిస్తారా లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. కొణతాల రాజకీయ పయనం.. చూస్తున్న వారు.. ఆయన ఎందుకు ఇంత గందరగోళంగా ఉన్నారన్న అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close