గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్నికలు ఒకటి రెండు నెలలు ముందే రావచ్చు.. అందరూ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లకు చాలా మందికి మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా పరోక్షంగా చెప్పారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కు 99 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒకరిద్దరు కూడా ఉన్నారు.

అయితే.. వీరిలో చాలా మంది దందాలకు దిగి.. ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. గతంలో కేటీఆర్ చాలా సార్లు కార్పొరేటర్లను హెచ్చరించారు. మరికొంత మందికి ఎమ్మెల్యేలతో సరిపడే పరిస్థితి లేదు. ఈ కారణంగా.. కేటీఆర్ కొంత మందిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. 15 మంది కార్పొరేటర్ల పనితీరు మరీ దారుణంగా ఉందని.. పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆరేళ్లలో గ్రేటర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సలహా ఇస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు తీవ్ర స్థాయిలో చేస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో హడావుడి చేశారు.

అభివృద్ది పనుల్లో వేగాన్ని పెంచారు. మామూలుగా అయితే..వచ్చే ఏడాది ప్రారంభంలో గ్రేటర్ ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండు, మూడు నెలలు ముందుగా నిర్వహించినా ముందస్తు ఎన్నికలు కావు. ఆరునెలలు ముందుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేటీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ఆయన ప్రమోషన్‌కు తిరుగు లేకుండా ఉంటుందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close