కేటీఆర్‌తో జగన్ భేటీ – అవన్నీ మర్చిపోయారా ?

తన పాలనను ఘోరంగా విమర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఏపీ సీఎం జగన్ దావోస్‌లో భేటీ అయ్యారు. భేటీ వివరాలను మంత్రి కేటీఆరే సోషల్ మీడియాలో పంచుకున్నారు. గొప్ప సమావేశం జరిగిందని చెప్పారు. మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడుల సదస్సు కోసం తెలంగాణ తరపున కేటీఆర్ ప్రతీ ఏడాది రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ సారి ఏపీ తరపున సీఎం జగన్ తొలి సారి వచ్చారు. ఇద్దరూ దావోస్‌లోనే ఉండటంతో కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్లతో కేటీఆర్ తీరిక లేకుండా సమావేశం అవుతున్నారు.

జగన్ కూడా పలువురు పారిశ్రామికవేత్తలకు ఏపీలో అవకాశాలను వివరిస్తున్నారు. ఇలాంటి బిజీ టైంలోనూ జగన్ తీరిక చేసుకుని కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల ఏపీలో రోడ్లు లేవు.. కరెంట్ లేదు.. ఏపీలో ఉంటే నరకం ఉన్నట్లేనని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అలాంటి వ్యాఖ్యలు ఇతరులు చేస్తే వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడేవారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం సంయమనం ప్రకటించారు. వ్యాఖ్యలు చేసిన రాత్రే… అన్యాపదేశంగా చేశానని ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ మాత్రం అదేమీ మనసులో పెట్టుకోలేదు.

ఇష్టమైనవాడు తిట్టినా ప్రశంసలే అన్నట్లుగా ఆయన కేటీఆర్‌తో సుహృద్భావ భేటీ నిర్వహించారు. పూర్తిగా రాజకీయ అంశాలపై వీరి చర్చ జరిగి ఉంటుందని చెబుతున్నారు. సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణసీఎం కూడా అదే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇతర అంశాలపై దావోస్‌లో చర్చించడానికి ఏమీ లేవని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close