సమస్యలు సృష్టించుకుంటోన్న కేటీఆర్ !

బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందో తెలిసి కూడా కేటీఆర్ తమకు కొత్త సమస్యలు సృష్టించుకునేలా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆయన మిలటరీ ఎరియాలకు కరెంట్, నీళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. దీని వెనుక ఎలాంటి సమస్య ఉందన్న విషయం పక్కన పెడితే.. ఇలా బెదిరించడం .. అదీ ఆర్మీని బెదిరించడాన్ని ఎవరూ సమర్థించే అవకాశం లేదు. కరెంట్, నీళ్లు టీఆర్ఎస్ లేదా కేటీఆర్ … ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ సొత్తు కాదు. మౌలిక సదుపాయాలను ఆపేస్తామనే ఆలోచన పాలకులకు రాకూడదు. కానీ ఇక్కడ కేటీఆర్ ఏకంగా ఆర్మీకే అవి లేకుండా చేస్తామన్నారు.

ఇలాంటి సిట్యూయేషన్ వస్తే బీజేపీ ఊరుకుంటుందా.. రంగంలోకి దిగింది. టచ్ చేసి చూడు అన్నట్లుగా సవాళ్లు చేయడం ప్రారంభించారు. కేటీఆర్ ఉద్దేశం అది కాకపోయినా ఆయన నేరుగా అన్న మాటలే కాబట్టి.. వదిలి పెట్టడం లేదు. ఆర్మీని బీజేపీ రాజకీయాలకు వాడుకున్నట్లుగా ఎవరూ వాడుకోరు. ఇప్పుడు కేటీఆర్‌ ఆ చాన్స్ బీజేపీకి ఇచ్చారు. చెలరేగిపోతున్నారు. కంటోన్మెంట్ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా మార్గాలున్నాయి. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. మొత్తానికి టీఆర్ఎస్ కు నష్టం తెచ్చేలా ఉన్నాయి.

బ్రిటిష్ హయాంలో మిలటరీ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ బోర్డు భాగ్యనగరం మధ్యలో ఉంది.కంటోన్మెంట్ బోర్డుగా ఇక్కడ పాలన సాగుతోంది. మిలటరీ నిబంధనల ప్రకారం అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ చుట్టుపక్కల అభివృద్ధి చేయాలంటే.. ఆర్మీ అనుమతి కావాలి. ఇక్కడే ప్రభుత్వానికి కోపం వస్తోంది. బీజేపీపై పోరాటంలో కేటీఆర్ బీజేపీకే అస్త్రాలు అందిస్తూండటం.. టీఆర్ఎస్ నేతల్ని కూడా విస్మయపరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

పుష్ష‌రాజ్ పాట‌: ఈసారి’డ‌బుల్’ డోస్‌

https://youtu.be/EdvydlHCViY?si=lC6JccPjEh516Zs5 సుకుమార్ - అల్లు అర్జున్‌ క‌లిస్తే ఏదో ఓ మ్యాజిక్ జ‌రిగిపోతుంటుంది. వీరిద్ద‌రికీ దేవిశ్రీ‌, చంద్రబోస్ కూడా తోడైతే - ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. 'పుష్ష‌'లో అది క‌నిపించింది. 'పుష్ష 2'లోనూ ఈ...

ధర్మాన చెప్పింది అబద్దమని తేల్చిన జగన్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.. రెవిన్యూ మంత్రి వేర్వేరుగా స్పందిస్తున్నారు. ఇద్దరూ ఒకటే మాట్లాడితే ఏ సమస్యా ఉండదు. కానీ ఇద్దరూ వేర్వేరుగా ప్రకటిస్తున్నారు. మంత్రి ధర్మాన చట్టం అమలు...

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close