నిందలు వేసి నిజాయితీ నిరూపించుకొమ్మంటారా..? : కేటీఆర్

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు, గ్లోబరీనా సంస్థ నిర్వాకంపై…ప్రతిపక్ష పార్టీలన్నీ తనను గురి పెట్టడంపై.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందలు వేసి నిజాయితీని నిరూపించుకొమ్మని సవాల్ చేయడమేమిటని మడిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు ఏ అంశం లేకనే… ఇంటర్మీడియట్ సమస్యను రావణకాష్టంలా రగిలిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం.. కేటీఆర్ పైనే గురి పెట్టి ప్రెస్ మీట్‌లో తీవ్రమైన విమర్శలు చేశారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ దేనని ఆరోపణలు చేశారు. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత… వీహెచ్ జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర హంగామా చేశారు. గ్లోబరీనా సంస్థ .. పేరే అసలు తనకు తెలియదని అన్న కేటీఆర్.. దమ్ముంటే… పెద్దమ్మ గుడికి వచ్చి.. ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి, వీహెచ్ చేసిన విమర్శలపై.. కేటీఆర్ పరోక్షంగా మండిపడ్డారు. విద్యాశాఖ అంశాన్ని ఐటీ శాఖకు లింకు పెడుతున్నారని విమర్శించారు. ఇంటర్‌ బోర్డ్‌ టెండర్లు ఇచ్చింది.. దానితో తనకు సంబంధమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. గ్లోబరీనాకు నిబంధనల ప్రకారం టెండర్‌ దక్కితే తప్పు తనకు ఎందుకు అంటగడుతున్నారని ప్రశ్నించారు. అసలు గ్లోబరీనా టెండర్ విలువ రూ. 4 కోట్ల టెండర్‌ను రూ. 10 వేల కోట్ల స్కాంగా చెబుతున్నారని కేటీఆర్‌ ఆశ్చర్యం వ్యక్తం చ ేశారు. ఓ బఫున్ పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు రమ్మంటే వెళ్లాలా అని..వీహెచ్‌ను ఉద్దేశింగా ఘాటుగా విమర్శించారు. ఒకరిని దొంగ అని ఆరోపించి నిజాయతీని నిరూపించుకొమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్‌ హెచ్చరించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని భరోసా ఇచ్చారు.

ఇటీవలి కాలంలో విపక్ష పార్టీలు..తెలంగాణ ప్రభుత్వంపై.. మూకుమ్మడిగా విరుచుకుపడిన ఘటన… ఇంటర్ బోర్డ్ వ్యవహరమే.ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా.. ఆత్మరక్షణలో పడిందని.. కేటీఆర్ మాటలతో భావింవచ్చు. ఇప్పటి వరకూ…టీఆర్ఎస్ నేతలు.. విపక్షాలపై విరుచుకుపడేవారు. విమర్శలు చేసేవారు. టీఆర్ఎస్ చేసే విమర్శలకు.. వాళ్లు సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇంటర్ బోర్డు వ్యవహారంలో మాత్రం పరిస్థితి మారిపోయింది. విపక్షాలు దూకుడుగా ఆరోపణలు చేస్తూంటే.. టీఆర్ఎస్ నేతలు .. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close