నిన్నంతా కేటీఆర్ ఢిల్లీలో ఏం చేశారు..?

తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీలో కీలక భేటీలు నిర్వహించారు. హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. ముందస్తు ఎన్నికలపై కేంద్ర పెద్దలతో చర్చలకే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబరు మొదటి వారంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. వాటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూలు వచ్చేలా ఇప్పటికే ఢిల్లీలో టీఆర్ఎస్ లాబీయింగ్ ప్రారంభించింది. అసెంబ్లీని ఇప్పుడు రద్దు చేసినా.. నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించకపోతే.. మొదటికే మోసం వస్తుంది. అందుకే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను రంగంలోకి దింపారు. ఆయన నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి అధికారులతో మంతనాలు జరిపారు.

రాజీవ్ శర్మతో పాటు డిల్లీ పర్యటనలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజిత్ కుమార్ కూడా ఉన్నారు. అందుకే ముందుస్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని నమ్ముతున్నారు. రాజీవ్ శర్మ ఈసీ అధికారులతో చర్చలు జరుపుతూండగానే… కేటీఆర్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. నిన్న ఉదయమే ఢిల్లీకి చేరుకుని.. రహస్యంగా పలువురు కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేటీఆర్ ఎవరెవర్ని కలిశారన్నది బయటకు తెలియనీయలేదు. సమావేశాలు పూర్తి చేసి..అంతే వేగంగా తిరిగి వచ్చేశారు. కేటీఆర్ హైదరాబాద్ చేరకున్న కొద్ది సేపటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ తో గంటకు పైగా భేటీ అయ్యారు.

ఆ తర్వాత తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నాలుగైదు రోజుల పాటు ఢిల్లీలో ఉండి అయినా సరే… పనులు చక్క బెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందస్తుకు వెళ్లడానికి అన్ని విధాలుగా సిద్ధమైన కేసీఆర్.. దానిపై గందరగోళంలో ఉన్నట్లు కనిపించడానికి.. కారణం.. ఈసీ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందో రాదోనన్న సందేహమేనని చెబుతున్నారు. అందుకే.. కేసీఆర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close