పోలింగ్ ముగిసిన తర్వాతే సర్వేలు ప్రకటిస్తా: లగడపాటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సర్వే ఫలితాలు తారుమారవడంతో.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మొదటి సారి నోరు విప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానన్నారు. 15 ఏళ్లుగా సర్వేలు చేయిస్తున్నాం.. మొదటిసారిగా సర్వే తారుమారైందన్నారు. అయితే అదే సమయంలో.. ఆయన ఈవీఎంలు, పోలింగ్ నిర్వహణ తీరుపై విమర్శలు చేసారు.పోలింగ్‌ శాతం చెప్పడానికి ఈసీకి రెండు రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు కలిగాయని. వాటిని ఈసీ నివృతి చేయలేదన్నారు. వీవీ ప్యాట్‌లు లెక్కించమని చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు అడిగినా.. ఈసీ ఒక్క చోట కూడా లెక్కించలేదని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా ప్రతిపక్షం బలం పెరిగిందని లగడపాటి చెబుతున్నారు. అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో.. ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోవాలి..కానీ అలా జరగలేదన్నారు.

అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. ఇప్పటికైనా అనుమానాలను తీర్చడానికి వీవీ ప్యాట్‌లను లెక్కించాలని లగడపాటి ఎన్నికల కమిషన్ కు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో గణనీయంగా డబ్బు ప్రభావం ఉందని ముందే చెప్పానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటకు కట్టుబడి ఉన్నానని.. తను ఏ పార్టీలో చేరబోవడం లేదని లగడపాటి ప్రకటించారు. చాలా మంది నేతలు పార్టీల్లోకి ఆహ్వానించారన్నారు. ఎవరి జోక్యంతోనో..ఎవరి ప్రోద్బలంతోనే నడిచే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తానెప్పుడు దొంగ సర్వేలు చేయలేదు..ఆ అవసరం తనకు లేదని లగడపాటి స్పష్టం చేశారు. ఇక నుంచి తాను చేసే సర్వే ఫలితాలు ఏవైనా పోలింగ్ తర్వాతే వెల్లడిస్తానని… ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. గెలుస్తారని చెప్పిన వాళ్లు ఓడిపోవడం వెనుక కారణాలు తనకు తెలుసని… పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత అన్ని విషయాలు చెబుతానని లగడపాటి స్పష్టం చేశారు.

మొత్తంగా లగడపాటి రాజపోపాల్ తన సర్వే రిపోర్ట్ కే.. తాను కట్టుబడినట్లుగా చెప్పుకొచ్చారు. ఫలితాలు వేరేగా వచ్చినా.. దానికి వేరే కారణాలున్నాయనట్లుగా మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలకు అనేక అనుమానాలు ఉన్నాయి. నా సర్వే తప్పయితే తప్పని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే క్షమాపణ చెబుతానని కూడా లగడపాటి చెప్పుకొచ్చారు. తెలంగాణ ఫలితాల షాక్ తో లగడపాటి చాలా రోజుల వరకు మీడియాతో మాట్లాడలేదు. ఇప్పుడే.. మొదటి సారిగా.. తన సర్వే గురించి మాట్లాడారు. పోలింగ్ కు ముందు తన సర్వే ఫలితాలను ప్రకటించననే నిర్ణయాన్ని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close