పవన్ కల్యాణ్ రాజకీయానికి లగడపాటి “గుడ్” సర్టిఫికెట్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని.. తనను తాను నియంత్రించుకుంటున్నారని… అది ఆయన రాజకీయ జీవితానికి మైనస్‌గా మారిందని కొద్ది రోజులుగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అయితే వీరికి భిన్నంగా..మాజీ ఎంపీ… తనను తాను రాజకీయ విశ్లేషకుడిగా చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ స్పందించారు. పవన్ రాజకీయ అడుగులు గొప్పగా వేస్తున్నారని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. పవన్ కల్యాణ్ గురించే స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ప్రజల కోసం నిలబడుతున్నారని.. ఆయన రాజకీయ వ్యూహాలు బాగున్నాయని చెప్పుకొచ్చారు.

అనూహ్యంగా లగడపాటి రాజగోపాల్ పవన్ కల్యాణ్‌ను పొగడటానికి కారణం ఏమిటో కానీ.. జనసైనికులకు మాత్రం కాస్త క్లారిటీ వచ్చింది. పవన్ కల్యాణ్ మొహమాట రాజకీయాలు చేయడం లేదని.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే… రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు. అయితే లగడపాటి పవన్ కల్యాణ్‌ను ప్రశంసించడం వెనుక ఏదైనా తెర వెనుకరాజకీయం ఉందా.. అన్న అనుమానం కూడా జనసేన వర్గాల్లో ప్రారంభమయింది. గతంలో సర్వేలు చేసి.. చేతులు కాల్చుకున్న లగడపాటి.. చాలా కాలంగా రాజకీయ వ్యాఖ్యలకు.. సర్వేలకు దూరంగా ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చేది లేదని చెబుతున్నారు.

సర్వేలు కూడా చేయనంటున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేశారు. ఆ పార్టీ పతనంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు.. ఆయన పవన్ ను ఎందుకు పొగుడుతున్నారోనని.. జనసైనికుల్లో కొద్దిగా సందేహం కూడా ప్రారంభమయింది. లగడపాటి మాటలు నచ్చి… పవన్ కల్యాణ్ మాటలు కలిపితే.. ఏం సలహాలిస్తారోనని.. వాటిని పవన్ పాటిస్తారేమోనని మరికొంత మంది ఆందోళన.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close