చిరుని పిల‌వ‌లేదు.. పిలిచినా బాల‌య్య రాలేదు

మా’ అధ్య‌క్షుడిగా ఈరోజు మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేసేశారు. ఆయ‌న‌తో పాటు విష్ణు ప్యాన‌ల్ నుంచి గెలిచిన స‌భ్యులంతా ప్ర‌మాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి కొంత‌మంది సినీ ప్ర‌ముఖుల్ని మంచు విష్ణు స్వ‌యంగా ఆహ్వానించాడు. నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటికి వెళ్లి.. ఆహ్వాన ప‌త్రం అందించాడు. ప్ర‌కాష్ రాజ్‌నీ పిలిచాడు. చిరంజీవికి కూడా ఆహ్వానం అందుతుంద‌ని అంతా ఆశించారు. కానీ.. చిరుని ఈ కార్య‌క్ర‌మానికి పిల‌వ‌లేదు. దాంతో ఆయ‌న క‌నిపించ‌లేదు. పిలిచినా.. బాల‌య్య రాలేదు. ప్ర‌కాష్‌రాజ్ తో పాటు, ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ లో గెలిచిన‌వాళ్లెవ‌రూ ఈ కార్య‌క్ర‌మంలో క‌నిపించ‌చ‌లేదు.

ఈ కార్యక్ర‌మానికి తెలంగాణ మాత్రం శ్రీ‌నివాస‌యాద‌వ్ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఆయ‌న ఈ సంద‌ర్భంగా చిత్ర‌సీమ‌కు వ‌రాలు ప్ర‌క‌టిస్తారేమో అని అంతా అనుకున్నారు. `మా` బిల్డింగ్ స్థ‌లం కోసం ఆయ‌న నుంచి ఏదైనా మాట వ‌స్తుంద‌ని ఆశించారు. కానీ అదీ లేదు. పైపెచ్చు ”ఇండ్ర‌స్ట్రీలో ఉన్న హీరోలంతా ముందుకొచ్చి, త‌లా కొంత వేసుకుంటే స‌మ‌స్య స‌మ‌సిపోతుంది” అనే టైపులో మాట్లాడారు. అంటే.. `మా` బిల్డింగ్ కోసం ప్ర‌భుత్వం ఏమీ ఇవ్వ‌ద‌న్న‌మాట‌. హీరోలే చేసుకోవాల‌న్న‌మాట‌. ప్ర‌స్తుతానికి ఇంతే. మంచు విష్ణు.. చొర‌వ‌, ఉత్సాహం చూపి, ప్ర‌భుత్వాన్ని, పెద్ద‌ల్నీ క‌దిలించ‌గ‌లిగితే త‌ప్ప – `మా` బిల్డింగ్ కి అటు నుంచి సాయం అంద‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close