మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ రోడ్డున పడింది. నామినేషన్ రోజు వరకూ మాగంటి గోపీనాథ్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయని..ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారని ఎవరికీ తెలియదు. నామినేషన్ పరిశీలన రోజు మొదటి భార్య కుమారుడు.. మాగంటి సునీత.. లీగల్ గా మాగంటి గోపీనాథ్ను పెళ్లి చేసుకోలేదని.. భార్య కాదని ఫిర్యాదు చేశారు. అలా అఫిడవిట్ దాఖలయినందున తిరస్కరించాలని అన్నారు. అయితే అప్పటికి నామినేషన్ ఆమోదించారు.
అయితే మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై .. మొదటి భార్య ఫిర్యాదు చేశారు. ఆ అంశంపై తహశీల్దార్ ఎదుట విచారణ జరిగింది. రెండు వర్గాలు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్ తల్లి..మొదటి భార్య వైపు ఉన్నారు. మొదటి భార్య కుమారుడే తమ వారసుడు అని స్పష్టం చేశారు. సునీతను అధికారికంగా పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. తన కుమారుడు చనిపోయినప్పుడు చూసేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వలేదని సునీతపై ఆరోపించారు.
అయితే మాగంటి సునీత కుమార్తె విచారణకు హాజరయ్యారు. సునీత తరపు లాయర్.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యగా పరిగణించకపోవడం, లీగల్ గా పెళ్లి కాలేదనడం సరి కాదని అంటున్నారు. తదుపరి విచారణ ఇరవై ఐదో తేదీన నిర్వహిస్తారు. మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ తానే వారసుడ్నని క్లెయిమ్ చేయడం సంచలనంగా మారింది. మాగంటి గోపీనాథ్ తల్లి కూడా మద్దతు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఇప్పుడల్లా తేలే అవకాశం లేదు.
