డైలామాలో మ‌హేష్ – సుకుమార్ సినిమా

‘వ‌న్‌’ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవ్వ‌బోతోంద‌ని ఆశించారు మ‌హేష్ బాబు ఫ్యాన్స్. ‘రంగ‌స్థ‌లం’ చూసి ఫ్లాటైపోయిన మ‌హేష్‌… త‌న‌కు ఆల్రెడీ ఓ ఫ్లాప్ ఇచ్చినా స‌రే, సుక్కుతో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి ముందుకొచ్చాడు. సుకుమార్ కూడా మ‌హేష్‌కి ఓ హిట్టిచ్చి బాకీ తీర్చేయాల‌నుకున్నాడు. వంశీ పైడి ప‌ల్లి సినిమా పూర్త‌వ్వ‌గానే… సుకుమార్ సినిమా పట్టాలెక్కిద్దామ‌నుకున్నాడు మ‌హేష్‌. అయితే ఇప్పుడు ఈ సినిమా కాస్త డైలామాలో ప‌డింది. సుకుమార్‌కి బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్‌రావ‌డ‌మే ఇందుకు కార‌ణం అనుకోవొచ్చు. వ‌రుణ్ ధావ‌న్ తో సుకుమార్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేసే ఛాన్సుంద‌ని స‌మాచారం. బాలీవుడ్‌లో మెరిసే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రు మాత్రం వ‌దులుకుంటారు? అందుకే సుకుమార్ అక్క‌డ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌.మ‌హేష్ కి కూడా ఇప్ప‌టికిప్పుడు సుకుమార్‌తో సినిమా చేసే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. త‌న క‌మిట్‌మెంట్లు చాలానే ఉన్నాయి. సురేంద‌ర్ రెడ్డి కూడా మ‌హేష్ తో సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. సైరా త‌ర‌వాత‌.. సూరి – మ‌హేష్‌ల కాంబో సెట్ట‌య్యే ఛాన్సుంది. మ‌హేష్ కోసం ఆగాలంటే.. సుక్కు కొన్నాళ్ల‌యినా ఖాళీగా ఉండాలి. అందుకే ఈలోగా మ‌రో సినిమా చేద్దామ‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. అది హిందీలోనా, తెలుగులోనా? అనేదే తేలాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close