బీజేపీకి అసలైన మిత్రుడు ఒవైసీపీనే ..!

యూపీలోనే కాదు గుజరాత్‌లోనూ బీజేపీని గెలిపించడానికి తన వంతు సాయం చేయడానికి మజ్లిస్ అధినేత ఓవైసీ రంగంలోకి దిగారు. యూపీలో వంద సీట్లకు పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక గుజరాత్‌లోనూ పోటీ చేస్తానని అక్కడ పర్యటించిమరీ ప్రకటించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఓవైసీ చెబుతూంటారు. బీజేపీని బద్ద శత్రువుగా పరిగణిస్తూంంటారు. బీజేపీ కూడా అంతే. అందుకే బీజేపీని ఓడిస్తామని బరిలోకి దిగుతున్నామని చెబుతూంటుంది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకి లాభిస్తోంది. మహారాష్ట్ర, బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగింది అదే.

మతతత్వ బీజేపీని ఓడించడానికంటూ బలం లేని రాష్ట్రాల్లో కేవలం ముస్లిం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పోటీ చేయడం వివాదాస్పదం అవుతోంది. నిజంగా బీజేపీని ఓడించాలంటే ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకుని వారికి సహకరించాలి. కానీ మజ్లిస్ అలా ఎప్పుడూ చేయదు. సొంతంగా పోటీ చేసి ముస్లిం ఓట్లను చీలుస్తుంది. ముస్లింలు ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి నష్టం ఉండదు. ప్రత్యర్థుల ఓట్లే చీలుతాయి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసిన అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో గెలుపొందారు. అక్కడ ఎంఐఎం పోటీతో జేడీయూ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చీలిపోయాయి. ఈ కారణంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు భారీగా ఓడిపోవడంతో ఎంఐఎం చీల్చిన ఓట్లే కీలకం., అక్కడ శివసేన కలవడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీలో మజ్లిస్ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు సమాజ్ వాదీ పార్టీ నుంచి చీలిపోతాయి. అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్లు అవుతుంది. ఇక్కడే ఓవైసీ బీజేపీని మద్దతిస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close