“కడియం” లాక్కుంటే తాడోపేడో తేల్చుకుంటానంటున్న పవన్ కల్యాణ్ !

తూ.గో జిల్లా కడియం మండలంలో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ జడ్పీటీసీ స్థానంతో పాటు అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలు గెల్చుకుంది. అయితే ఇలాంటి విజయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సహించలేరు.. భరించలేరు. దానికి తగ్గట్లుగానే జనసేన నేతలకు వేధింపులు ప్రారంభమయ్యాయి. అయితే విజేతలంతా వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యామ్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. 24వ తేదీన మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకూ తమను తాము కాపాడుకోవడం కష్టమవుతోందని.. కుటుంబసభ్యులను వేధిస్తున్నారని వారు వచ్చి పవన్ కల్యాణ్‌కు తెలుపుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో ఇన్ని స్థానాలు గెల్చుకున్నా కూడా ఇంకా జనసేన గెల్చుకున్న స్థానాన్ని అక్రమంగా పొందాలనుకోవడం ఏమిటని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇందు కోసం ఒత్తిళ్లు, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే గెలుపొందిన ఎంపీటీసీ అభ్యర్థుల్ని భయపెట్టేలా వారి అనుచరుల్ని కొట్టారని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ నేతలకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అంతే కాదు 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జనసేన ఎంపీటీసీలను ఇబ్బంది పెడితే తానే స్వయంగా వస్తానని వారికి భరోసా ఇచ్చారు.

స్వయంగా తానే వచ్చే పరిస్థితులు రావాలని ప్రభుత్వం కోరుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరగకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. దౌర్జన్యాలను ఇలానే కొనసాగిస్తే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close