బెంగాల్‌లో దీదీ వైపు చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు..!

ఫిరాయింపుల బలం మీద ఆధారపడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో భారతీయ జనతా పార్టీ బెంగాల్‌లో అనుభవించే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో దాదాపుగా 30 మంది .. తాము తృణమూల్‌లోకి వస్తామని.. మమతా బెనర్జీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. కొంత మంది బహిరంగంగా.. మరికొంత మంది సీక్రెట్‌గా సందేశాలు పంపుతున్నారు. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ సహా… అనేక మంది జాబితా ఇప్పుడు.. దీదీ ముందు ఉంది. మమతా బెనర్జీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే.. వారంతట వారు తృణమూల్‌లోకి వచ్చేందుకు సిద్ధమవడమే.. ఇక్కడ అసలు రాజకీయం.

బీజేపీ నేతలుగా ఇప్పుడు చెలామణి అవుతున్న వారంతా.. ఒకప్పుడు.. టీఎంసీ నేతలే. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో అత్యధికులు టీఎంసీ నేతలే. ఈకారణంగా చాలా మంది తిరిగి వస్తామని కబురు చేస్తున్నారు. వరు ఇలా తిరిగి రావడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. బెంగాల్‌లో ఎప్పుడూ రాజకీయ ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది. అక్కడ నెట్టుకు రావాలంటే అధికారం ఉండాలన్న భావనలో ఉన్నారు. మమతా బెనర్జీ గట్టిగా పోరాడుతూండటంతో.. కేంద్రంలో ఉన్న అధికారం.. రాష్ట్ర రాజకీయాల్లో చెలాయించడానికి అవకాశం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యేలు దీదీ వైపు చూస్తున్నారు.

అయితే తాము పార్టీలోకి వస్తామని కబురు చేస్తున్న వారందర్నీ పార్టీలో చేర్చుకోవడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. పార్టీ కష్టకాలంలో వదిలి పెట్టి వెళ్లిపోయిన వారిపై ఏ మాత్రం ఆమె సానుభూతి చూపించడం లేదు. బీజేపీ బెదిరింపులకు భయపడి వెళ్లినా… వ్యక్తిగత విమర్శలు చేయని వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి వారినే చేర్చుకోవాలని అనుకుంటున్నారు. టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్.. దీదీని ఎప్పుడూ… వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఈ కారణంగా ఆయనను చేర్చుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో బీజేపీ సగం ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లోపు మరింతగా బీజేపీని దెబ్బకొట్టాలని మమతా బెనర్జీ గట్టి పట్టుదలతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close