ఎంతపని చేసావు మత్తయ్య?

రావెల సుశీల్ ఒక ముస్లిం మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు జైలుపాలయిన తరువాత, అతని తండ్రి మంత్రి రావెల కిషోర్ బాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటల వలన తెదేపా ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివచ్చింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి రావెలపై కోప్పడ్డారు కూడా. ఈ అంశంపై వైకాపా శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉంది కనుక దానికి ఏవిధంగా జవాబు చెప్పుకోవాలాని తెదేపా ఆలోచిస్తుంటే తెదేపాకే చెందిన జెరూసలెం మత్తయ్య రావెల కిషోర్ బాబుకి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

మంత్రి రావెల, ఆయన కుమారుడిపై అసత్య కధనాలు ప్రచురించినందుకు సాక్షి మీడియాపై, జగన్ మరియు వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రాష్ట్ర ఎస్సీఎస్టీ కమీషన్ కి పిర్యాదు చేశారు. వైకాపాను ఎదుర్కోవడానికి అది కూడా తెదేపా వ్యూహంలో భాగం అనుకోవాలా లేక తెదేపా అధిష్టానానికి తెలియకుండానే మత్తయ్య ఇందుకు పూనుకొన్నారని అనుకోవాలా? ఒకవేళ తెదేపాలో వ్యూహంలో భాగంగానే మత్తయ్య ఆవిధంగా పిర్యాదు చేసారంటే, దానర్ధం తెదేపా ప్రభుత్వం మంత్రి రావెల కిషోర్ బాబుని ఆయన కొడుకు సుశీల్ ని వెనకేసుకువస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.

ఒకవేళ తెదేపా అధిష్టానానికి తెలియకుండా మత్తయ్య ఈ పిర్యాదు చేసి ఉండి ఉంటే, ‘మంత్రి రావెలని, సుశీల్ ని ప్రభుత్వం వెనకేసుకు వస్తోందా?’ అని శాసనసభలో వైకాపా నిలదీస్తే దానికి జవాబు చెప్పుకోలేక తెదేపా ప్రభుత్వం చాలా ఇబ్బందిపడవచ్చును. ఇంతకీ మత్తయ్య ఎవరి ప్రోద్బలంతో సాక్షి మీడియా, వైకాపా నేతలపై రాష్ట్ర ఎస్సీఎస్టీ కమీషన్ కి పిర్యాదు చేసారో? తెలియాల్సి ఉంది.

రాజధాని ప్రాంతంలో కొన్ని గ్రామాల రైతులు తమ భూముల అమ్మకాల గురించి సాక్షి మీడియాలో అసత్య కధనాలు ప్రచురిస్తునందుకు దానిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. వారు స్థానిక తెదేపా నేతల ప్రోద్బలంతోనే ఆపని చేసారని తెలుస్తూనే ఉంది. కానీ ఆ విషయంలో తెదేపా చాలా వ్యూహాత్మకంగానే పావులు కదిపినట్లే చెప్పవచ్చును. కానీ రావెల కిషోర్, సుశీల్ విషయంలో మత్తయ్య చేసిన పనికి బెడిసికొట్టే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close