ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ , ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వన్డే ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. వ్యక్తిగత స్వార్ధం కోసం జట్టులో కొనసాగలేనని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు మ్యాక్సీ.
వన్డేలో తనదైన ముద్ర వేసిన మ్యాక్స్ వెల్ ఊహించని విధంగా రైటర్ మెంట్ ప్రకటించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. దాంతో తన రిటైర్ మెంట్ కు అసలు కారణం ఏంటనేది చెప్పుకొచ్చాడు. వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని రిటైర్ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు మ్యాక్స్ వెల్.
2027లో వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ విషయం గురించి సెలక్టర్లతో మాట్లాడాను. ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడంతో ఆ టోర్నీలో ఆడుతానని అనుకోవడం లేదని, అందుకే తన స్థానంలో యువ ఆటగాడికి చోటు కల్పించాలని చెప్పా. తన స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇస్తే వరల్డ్ కప్ నాటికి జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగేందుకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది” అన్నాడు మ్యాక్సీ. వ్యక్తిగత రికార్డ్ ల కోసం క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదని, వరల్డ్ కప్ కు జట్టు కూర్పు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని పేర్కొన్నారు మ్యాక్స్ వెల్.
2012లో అఫ్గానిస్థాన్ పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు మ్యాక్స్ వెల్. ఇప్పటివరకు 149 వన్డేల్లో ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. 33.81 సగటుతో 3990 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. 2023లో ఇండియాలో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్.. ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విశ్వరూపం ప్రదర్శించాడు. గాయపడిన కాలితో కుంటుతూనే 201 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు.