మీడియా వాచ్ : తొలి ఆంధ్రా చానల్ మూసివేత..!

ఆంధ్రప్రదేశ్‌కు ఏదీ కలసి రావడం లేదు. రాజధాని పునాదుల్లోనే ఉండిపోయింది. శిథిలమైపోతోంది. మూడు రాజధానులు అంటూ.. ఎటు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో ఆంధ్రప్రదేశ్ మీడియా కూడా.. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడే అవకాశం కనిపించడం లేదు. ఇంకా చాలా కాలం పాటు హైదరాబాదే కేంద్రంగా ఉండనుంది. నవ్యాంధ్ర తొలి తెలుగుచానల్‌గా ప్రారంభమైన ఏపీ 24/7 మూతబడింది. గత నాలుగైదు నెలలుగా ఉద్యోగులకు జీతాలివ్వడంలేదు. దాంతో వారు ధర్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో చానల్‌ను మూసేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది.

విజయవాడ కేంద్రంగా మొదలైన చానల్ కు మా టీవీ మాజీ అధినేత మురళీకృష్ణంరాజు చైర్మన్. మరికొంత కూడా పెట్టుబడులు పెట్టారు. మొదట్లో పరవాలేదనుకున్నట్లుగా నడిచింది. ఆంధ్రా ప్రజలు ఓన్ చేసుకునేంత స్టఫ్ లేకపోయినా.. విజయవాడ కేంద్రంగా మీడియా రంగం స్థిరపడటానికి ఓ బేస్ ఏర్పాటయిందని అనుకున్నారు. కానీ ఉద్యోగుల ఆధిపత్య పోరు మొదటికే మోసం తెచ్చింది. ఒక్కొక్కరుగా వైదొలగడం ప్రారంభించారు. చివరికి వెంకటకృష్ణ కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత వైసీపీ నేతలు ఆ చానల్‌ను తీసుకున్నారని.. మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో సీఈవో గా చేసిన సుధాకర్ ని తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది.

వ్యాపార పరంగా ఎదగాలంటే.. అన్ని రంగాలకు కేంద్రం అవ్వాలి. కనీసం.. ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యాపారాలైనా అక్కడ్నుంచి సాగాలి. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు ఏపీ ప్రజలు.. చదువులు, ఉద్యోగాలు.. చివరికి వైద్య సేవల కోసం కూడా పొరుగు రాష్ట్రాలపై ఆదారపడే పరిస్థితి ఉంది. ఏపీ ప్రజలకు సమాచారం ఇచ్చే మీడియా కూడా హైదరాబాద్ గడ్డపైనే ఉండనుంది. ఇంకెంతకాలమో.. ఎవరూ చెప్పలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close