సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ సంబరాలను .. సంతోషాలను అభిమాన ప్రపంచం కోసం బయట పెట్టింది. సాధారణంగా ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగను.. బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో చిరంజీవి కుటుంబం అంతా జరుపుకుంటుంది. ఈ సారి కూడా అక్కడే జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సందడి.. ఆ సంతోషం.. ప్రతీ క్షణం ఫోటోల రూపంలో సాక్ష్యాలుగా విడుదల చేసింది.

ఈ సారి చిరంజీవి ప్రత్యేకంగా సంబరాలు నిర్వహించారు. గానాబజానా ఏర్పాటు చేశారు. దీనికి కారణం … నాగబాబు కుమార్తెకు కొత్తగా పెళ్లి కావడం.. తమ ఇంట కొత్తల్లుడు రావడమే. తొలిరోజు భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ.. సంక్రాంతి,కనుమ పండుగల్ని కూడా అదే రేంజ్‌లో జరుపుకుంది. ఇది మెగాస్టార్ ఇంట జరిగిన సంక్రాంతి పండగ కనుక మర్యాదలు కూడా మెగా రేంజులోనే వున్నాయి. ఈ మధ్య చీరంజీవి అంటే ఎక్కువ మంది దోశెలు గుర్తు చేసుకుంటున్నారు. లాక్ డౌన్‌లో ఆయన దోసెలు వేయడం.. అలాగే.. అహా షోలో.. కళ్లకు గంతలు కట్టుకుని దోసెలు వేయడం బాగా పాపులర్ అయిపోయాయి. అందుకే.. భోగిమంటల సమయంలోనూ దోశెల హడావుడి కనిపించింది.

చిరంజీవి కుటుంబసభ్యులు చిన్నా పెద్దా.. అందరూ పాల్గొన్నారు. ఇక మెగా ఇంటి ఆడపడచులు, కోడళ్లతో ప్రత్యేకంగా ఫోటో సెషన్ పెట్టించారు. తన సోదరిమణులతో చెర్రీ దిగిన ఫోటో బాగా ఆకర్షిస్తోంది. సంక్రాంతి రోజు రాత్రి మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఈ మ్యూజికల్ నైట్ ఎంతో సందడిగా సాగింది. అక్కినేని నాగార్జున ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. చిరంజీవి ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close