అనిరుథ్ వెళ్లాడు.. మిక్కి జె మేయర్ వచ్చాడు

నితిన్, సమంత మొదటిసారి జతకడుతున్న సినిమా అ..ఆ. మాటల మాత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం వరకు పూర్తయ్యింది. అయితే ఈ సినిమాకు ముందునుండి కొన్ని అవాంతరాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. సినిమా మొదట్లో ఆర్ట్ డైరక్టర్ రాజీవన్ ని తొలగించిన దర్శకుడు త్రివిక్రం ఇప్పుడు సినిమా సంగీత దర్శకుడు అనిరుథ్ ని కూడా తొలగించాడట.

సినిమాకు ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ జగరగాల్సి ఉన్నా కోలీవుడ్ లో బీప్ సాంగ్ గొడవ, ఇంకా అక్కడ మిగతా పనులతో అనిరుథ్ ఈ సినిమాకు సమయం కేటాయించలేదు. ఆ కారణం చేత అతన్ని తొలగించి మరో సంగీత దర్శకుడు మిక్కి జె మేయర్ ని తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే అనిరుథ్ తొలగించబడ్డాడు కదా ఇక మరోసారి త్రివిక్రం దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకుంటాడు అనుకున్నారు అందరు.

కాని ఇప్పటికే దేవి కమిట్ అయిన సినిమాలు ఉండటంతో త్రివిక్రం అ..ఆ సినిమాకు టైం కేటాయించడం కాస్త కష్టం అని చెప్పాడట. అందుకే మిక్కి జె మేయర్ ను అ..ఆ సినిమాకు కన్ఫాం చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా మలయాళ ప్రేమం బ్యూటీ అనుపమ పరమేస్వరన్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్ని హంగులను ముగించుకుని సినిమాను ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : పాలిటిక్స్‌కు ఫేక్ వైరస్ !

" నిజమో అబద్దమో మన ప్రత్యర్థుల్ని దెబ్బ తీస్తుందనుకుంటే అది ప్రచారం చేయండి.. " అని కొన్నేళ్ల క్రితం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం...

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close