5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు ప్రారంభమయింది. బడ్జెట్‌లో ప్రతిపాదించారు.. ఆయా శాఖలకు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు (బిఆర్ఒ) కూడా ఇచ్చేశారు.. ఇక అభివృద్ధి చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసేశారు.. అయితే నాలుగు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కానీ ఈ సొమ్ము మాత్రం ఖర్చయిపోయింది.

బడ్జెట్‌లో చూపించిన లెక్కల్లో నాలుగు నెలల్లో ఖర్చు చేయాల్సిన రూ.41,170 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ నిబధనల ప్రకారం… కేటాయించిన కేటాయించిన నిధులను ఆయా శాఖలకు జమ చేయాలి. కానీజమ చేస్తున్నట్లుగా ఆదేశాలిస్తున్నారు కానీ జమ కావడం లేదు. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదని, కొన్ని శాఖలకు విడుదల చేసినా వాటిని వెనక్కు తీసుకుంటున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థికశాఖ దగ్గర్నుంచి వ్యవసాయ శాఖ వరకూ ఇలా అన్నిశాఖల్లో వేల కోట్లలోనే ఈ గోల్ మాల్ జరిగింది. గత ఏడాది కూడా అలాగేజరిగింది. అయితే బుక్ అడ్జస్ట్ మెంట్స్ అని బుగ్గన సమర్థించుకున్నారు. కానీ ఆ లెక్కవేలో తేలలేదు. ఇప్పుడు కూడా అదే చెప్పే అవకాశం ఉంది. అయితే ఆ డబ్బులన్నీ ఎవరో తినేసి ఉండరని.. జీతాలు… పథకాలకు మళ్లించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ పూర్తిసమాచారం బయటకు రాదు. ఎంత గోల్ మాల్ చేశారో.. తెలియాలంటే.. ప్రభుత్వం మారాల్సిందే. లేకపోతే కేంద్రం సంకల్పించాలి. కేంద్రం అలాంటి పనులు చేసే ఉద్దేశంలో లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close