చంద్రబాబుకు స్వాగతం చెప్పి భేటీకి మాత్రం దూరంగా గంటా !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. బుధవారం చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టులో ల్యాండయినప్పుడు స్వాగతం చెప్పడానికి వచ్చిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. శ్రీకాకుళం పర్యటనలో పాల్గొనలేదు. ఆయనది ఆ జిల్లా కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు…కానీ చంద్రబాబు విశాఖలో కార్యకర్తల సమావేశం పెడితే మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన తీరుపై టీడీపీలో భిన్న చర్చ జరుగుతోంది.

గంటా శ్రీనివారావు పార్టీ వీడుతారని చాలా కాలం చర్చ జరిగింది. కానీ ఆయన వెళ్లలేదు. ఇటీవల ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని చెబుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలను మాత్రం నిర్వహించడం లేదు. ఆయన సొంతంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ పరిస్థితి మెరుగుపడటంతో ఆయన పార్టీలో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఇతర నేతలు మాత్రం ఏకమవుతున్నారు.

ఇంత కాలం తాము ప్రభుత్వాన్ని ఎదుర్కొని కేసులకు భయపడకుండా పోరాడుతూంటే.. సైలెంట్‌గా ఇంట్లో కూర్చుని బురదపాముల్లా ఇప్పుడు కొంత మంది బయటకు వస్తున్నారని అయన్నపాత్రుడు లాంటి వారు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా పార్టీ కోసం పని చేయని వారికి ప్రాధాన్యం ఇవ్వనని చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వచ్చినా గంటా సమావేశానికి హాజరు కాకపోవడం టీడీపీలో మరోసారి భిన్నమైన చర్చలకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close