వ్యవసాయ రంగం మీద ప్రధానంగా దృష్టి!

మోడీ సర్కారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ సాగిన ప్రచారాన్ని, అలా అంటుకున్న కొంత కళంకాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ‘రైతు మిత్ర’ బడ్జెట్‌ ప్రతిపాదనల్ని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదిస్తున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి నాలుగు ప్రత్యేక పథకాలను ఆయన ప్రకటించారు. అలాగే పంటల బీమా విషయంలోనూ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సేవలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి సమీకృతంగా అందించేలా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 28 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం లక్ష్యంగా ఎంచుకుంటున్నట్లు జైట్లీ ప్రకటించారు. గ్రామీణ వ్యవసాయ బ్యాంకింగ్‌ రంగాలకు దన్నుగా నిలుస్తామని ప్రకటించారు.

నరేంద్రమోడీ సర్కార్‌ పాలన ప్రారంభించిన తర్వాత.. తొలిరోజుల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతు వ్యతిరేక ముద్ర పడడానికి కారణం అయ్యాయి. ప్రత్యేకించి భూసేకరణచట్టంలో మార్పులు వంటివి దీనికి కారణం అయ్యాయి. రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రలు గట్రాచేసి రైతు వ్యతిరేక ఇమేజి పెరగడానికి కొంత కష్టపడ్డారు. అయితే ఈ బడ్జెట్‌లో చాలా వరకు రైతు ప్రయోజనాలపై దృష్టిపెట్టారు. రైతు సంక్షేమానికి ఏకంగా 36 వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం.
రాబోయే మూడేళ్లలో 5లక్షల ఎకరాల్లో ఆర్గానిక్‌ సేద్యం చేసేలా ప్రణాళికలు తెస్తున్నారు. గ్రామాలసంక్షేమానికి ప్రత్యేకించి విద్యుత్‌, రోడ్డు వసతులు కల్పించడానికి అనేక నిర్ణయాలు ప్రకటించారు. సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పరంపరాగత్‌ కృషియోజన పేరుతో పథకాలు రూపొందించారు. ఈశాన్య భారతం కోసం ప్రత్యేక సేంద్రియ విధాన పద్ధతులు తెస్తాం అన్నారు. పప్పు ధాన్యాల సాగుకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close