దసరా బరిలో ప్రేమమ్ సినిమా కూడా నిలిచింది. నాగచైతన్య నటించిన ఈ చిత్రాన్ని అక్టోబరు 7న విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీని ప్రేమమ్ ఆడియో వేడుక సాక్షిగా నాగార్జున ప్రకటించేశాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ప్రేమమ్. ఆడియో వేడుక ప్రస్తుతం హైదరాబాద్లోని నోవొటెల్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఎవరే’ గీతాన్ని నాగార్జున రిలీజ్ చేశాడు. నాగ్ మాట్లాడుతూ… అనుకొన్న సమయానికే సెన్సార్ జరిగితే ఈ చిత్రాన్ని అక్టోబరు 7న తీసుకొస్తానన్నాడు. నాగ్ మాట్లాడుతూ…
”ఎవరే పాటని అందరికంటే ముందే నాగచైతన్య నాకు వినిపించాడు. అప్పటి నుంచీ ఈ పాట ప్రతీ రోజూ వింటూనే ఉన్నా. ప్రేమమ్ అంటే ఏమిటో ఈమద్య తెలుసుకొన్నా. ప్రేమమ్ అంటే సంస్ర్కృతంలో ప్రేమ అని అర్థం. ఈ సినిమా కోసం చైతూ గడ్డం పెంచినప్పుడు చూశా. ‘నీకు గడ్డం చాలా బాగుంది’ అన్నా. నాక్కూడా ఓం నమో వేంకటేశాయ కోసం గెడ్డం పెంచాల్సివచ్చింది. ఇప్పుడు మా ఇద్దరి గెడ్డాల్లో ఏది బాగుందో మీరే చెప్పాలి. చైతూ మాత్రం ‘డాడీ నీ గెడ్డమే బాగుంది’ అంటున్నాడు. ప్రేమకథా చిత్రాల్ని అభిమానులు ఆదరిస్తూ వచ్చారు. దేవదాసు, ప్రేమాభిషేకం, గీతాంజలి చిత్రాలకు పట్టం కట్టారు. ఆ జాబితాలో ప్రేమమ్ చేరుతుంది” అన్నాడు. ఈ వేడుకలో చైతూ పెళ్లి గురించి నాగార్జున మాట్లాడతాడేమో అని అందరూ ఎదురుచూశారు. కానీ ఓ పాట విడుదల చేసి హడావుడిగా వెళ్లిపోయాడు నాగ్. తెల్లారితే ఓం నమో వేంకటేశాయ షూటింగ్లో పాలుపంచుకోవాలని, అందుకోసం పెద్ద పెద్ద డైలాగులు రాసిచ్చారని, అవన్నీ చదువుకోవాలని.. చెప్పి ప్రేమమ్ ఆడియో వేడుక నుంచి సెలవు తీసుకొన్నాడు నాగ్.