మంగళవారం ఉ.10 గంటలకు.. మిత్రోమ్..!

మూడు వారాల క్రితం.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన లాక్‌డౌన్ గడువు మంగళవారంతో ముగుస్తుంది. కొనసాగించాలనే రాష్ట్రాల డిమాండ్ల మధ్య .. ఏం చేయాలన్నదానిపై ప్రధానమంత్రి చర్చోపచర్చలు జరిపారు. చివరికి ఓ ఫార్ములాని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం.. పది గంటలకు.. జాతినుద్దేశించి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దేశాన్ని మూడు జోన్లుగా విభజించి లాక్‌డౌన్ సడలించే ప్రక్రియపై ఓ ఫార్ములాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

తయారీ రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలకు.. మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. రెండు రోజులుగా ప్రధాని నివాసంలో హైలెవల్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. కేంద్ర హోం, రక్షణ, ఆరోగ్య శాఖ మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. వాణిజ్య శాఖ కూడా.. లాక్‌డౌన్‌ సడలింపుపై కేంద్ర హోంశాఖకు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని వివిధ రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.

అయితే.. ఆయా రాష్ట్రాల లాక్ డౌన్లు కూడా… కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి రాకపోకల్ని పూర్తిగా నిషేధించడం… గ్రీన్ జోన్లలో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో పాటు.. పారిశ్రామిక రంగం … కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ఆర్థిక విపత్తు నుంచి తప్పించుకోవచ్చన్న అభిప్రాయం కేంద్రంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం… ప్రధానమంత్రి మోడీ ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close