అక్ష‌రాభ్యాసంలో కొత్త సంప్ర‌దాయం

అక్ష‌రాభ్యాసం చేయించిన‌ప్పుడు చిన్న పిల్ల‌ల‌తో ఓం న‌మఃశివాయ అని రాయిస్తారు. దీనికి కార‌ణం శివ‌పంచాక్ష‌రిని మొద‌ట రాయిస్తే స‌ర్వం శుభ‌క‌ర‌మ‌ని భావించ‌డం. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ విష‌యంలో కొత్త సంప్ర‌దాయాన్ని సృష్టించారు. త‌న మ‌న‌వ‌డు దేవాంశ్ అక్ష‌రాభ్యాసాన్ని వైభ‌వోపేతంగా నిర్వ‌హింప‌జేసిన ఆయ‌న ఆ త‌దుప‌రి ఈ అంశాన్ని వెల్ల‌డించారు. త‌న మ‌నుమ‌డితో అమ్మ‌, అమరావ‌తి, ఆదాయం, ఆరోగ్యం, ఆనందం అనే ప‌దాల‌ను రాయింప‌జేశారు ముఖ్య‌మంత్రి. ఆ ర‌కంగా అమ‌రావ‌తిప‌ట్ల త‌న‌కెంత అనుర‌క్తి ఉన్న‌దీ చాటుకున్నారు. మ‌నుమ‌డి అన్న‌ప్రాశ‌న కూడా తిరుమ‌ల‌లోనే నిర్వ‌హించాన‌నీ, కొత్త ప‌దాలు రాయించి, స‌రికొత్త సంప్ర‌దాయాన్ని సృష్టింప‌జేశాన‌నీ తెలిపారు. మ‌నుమ‌డంటే ఎవ‌రికి అనుర‌క్తి ఉండ‌దు చెప్పండి. అ అంటే అమ్మ అని రాయించారు ఓకే. ఆ అంటే ఆవు అని క‌దా రాయించాలి. ఆదాయం, ఆరోగ్యం, ఆనంద‌మంటే ఎంతో ఇష్ట‌మున్నా ఆవును ఎందుకు విస్మ‌రించారు. ఆవు పాల‌తో ఆయ‌న రాయించిన మూడు ప‌దాల లాభాల‌ను పొందారు కాబ‌ట్టి, రాయ‌న‌వ‌సరం లేద‌నుకున్నారా! ఎంతైనా చంద్ర‌బాబు తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చాలా చాక‌చ‌క్యంగా చెప్ప‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నారు. దేవాంశ్ అక్ష‌రాభ్యాసం సందర్భంగా ఆయ‌న ఎంతో మురిసిపోయారు. మ‌న‌వ‌ణ్ణి చంక దింప‌లేదంటే న‌మ్మండి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ ‘కిష్కింద‌పురి’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ 11వ చిత్రానికి సంబంధించి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ చిత్రానికి సాహు గార‌పాటి నిర్మాత‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదోక హార‌ర్ మిస్ట‌రీ...

విజయశాంతిని ప్రచారానికి కూడా పిలవట్లేదే !

ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ...

బొండా ఉమ వైపే రాయి – వైసీపీ చీప్ ట్రిక్కులు !

రాయి రాజకీయాన్ని బొండా ఉమ వైపు తిప్పడానికి కుట్ర సిద్ధాంత నిపుణుడు సజ్జల రామకృష్ణారెడ్డి... పోలీసులతో కలిసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డెర బస్తీ పిల్లల్ని టార్గెట్ చేసిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close