నిర్మలా సీతారామన్‌ పుణ్యానికి పోతే…

హైదరాబాద్: పుణ్యానికి పోతే పాపం ఎదురయింది అన్నది ఒక నానుడి. కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇవాళ ఇదే పరిస్థితి ఎదురయింది. ఆంధ్రాలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మీడియాద్వారా తెలుసుకున్న మంత్రి, రెండు రోజులలో ఆ ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పటమేకాక అన్నట్లుగానే ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే విహారయాత్రకు ఇటలీకి వెళ్ళిన పొగాకు బోర్డ్ ఛైర్మన్ గోపాల్‌ను సస్పెండ్ చేశారుకూడా.

అయితే రైతు ఆత్యహత్యలపై ఇంతగా స్పందించిన మంత్రికి దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రకాశంజిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. కొందరు పొగాకు రైతులు నిర్మల కాన్వాయ్‌ను అడ్డగించారు. రహదారికి అడ్డంగా బైఠాయించి మిగిలిన పొగాకు కొనుగోలుకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె కారుదిగి రైతులతో మాట్లాడి పొగాకు కొనుగోలుకు చర్యలు చేపడతామని నచ్చచెప్పారు. ఆ తర్వాత రైతులు అడ్డు తప్పుకోవటంతో ఆమె పర్యటన కొనసాగింది. రాష్ట్రమంత్రులు శిద్ధా రాఘవరావు, పత్తిపాటి పుల్లారావుకూడా నిర్మలవెంట ఉన్నారు. నిర్మల కందుకూరులోని పొగాకు కొనుగోలు కేంద్రానికి వెళ్ళి రైతు సమస్యలపై వారితో మాట్లాడారు. రైతులు అధైర్యపడొద్దని, మిగిలిన పొగాకును కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక రైతు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంత్రిని అడ్డుకున్ రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close