ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులన్నీ తొలగించాల్సిందేనన్న హైకోర్టు..!

పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలు ప్రభుత్వానివి.. కార్యాలయాలకు పార్టీ రంగులు ఉండకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున రంగులు తొలగించాలనిఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని …కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రభుత్వ భవనానికి వైసీపీ పార్టీ రంగులు వేయడం ప్రారంభించారు. ఫలానా రంగులు వేయాలని అధికారులు స్వయంగా ఆదేశాలు జారీ చేశారు.

ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా… ఉన్నతాధికారుల ఆదేశం మేరకు.. పంచాయతీ భవనాలు, గ్రామ సచివాలయాలకు.. పార్టీ రంగులు వేశారు. అప్పుడే… ఎన్నికల కోడ్ ప్రకారం.. స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే… రంగులన్నింటినీ తొలగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే.. ప్రభుత్వం మాత్రం.. అలాంటిదేమీ పట్టించుకోలేదు. రంగుల వేయడం అనే ప్రక్రియను కొనసాగించింది. ఈ రంగుల కోసం… దాదాపుగా పదహారు వందల కోట్లు ఖర్చు చేసినట్లుగా ప్రచారం జరిగింది. అధికారిక లెక్కలను మాత్రం ప్రభుత్వం ఇంత వరకూ బయటపెట్టలేదు.

కొద్ది రోజుల క్రితం.. గుంటూరు జిల్లా పల్లపాడులోని ఓ స్కూల్‌కు రంగులు వేయడంపై.. ఆ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడే హైకోర్టు తొలగించాలని ఆదేశించింది. ఇప్పుడు.. అలాంటి తీర్పు.. రాష్ట్రం మొత్తానికి వర్తింప చేస్తూ.. ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు.. పంచాయతీ భవనాలన్నింటికీ తెలుపు రంగు కోసం బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close