ఆకస్మిక తనిఖీల్లేవ్…సుదీర్ఘ ప్రసంగాలే..!

ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలి రోజు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. కానీ ఈ జిల్లాల పర్యటనలకు ముందు జరిగిన ప్రచారానికి.. నిన్న జరిగిన పర్యటన తీరుకు అసలు పొంతన లేదు. తాను ప్రభుత్వం చేపట్టిన పనుల పురోగతిని చూడటానికి ఆకస్మిక తనికీలు చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో… కేసీఆర్ ఎక్కడ .. ఏం పరిశీలిస్తారోనని ప్రజలు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అసలు పర్యటన మాత్రం నామమాత్రంగా సాగింది. సిద్దిపేట రాగానే.. సమీకృత కార్యాలయాలను ప్రారంభించారు.. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించారు.

కామారెడ్డిలోనూ అంతే. ఎక్కడా ఆకస్మిక పర్యటన చేస్తారని కానీ.. చేసేందుకు సిద్ధమవుతారన్న సంకేతం కూడా రాలేదు. దీంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ చెప్పిన దానికి చేసే దానికి పొంతన లేదన్నవిమర్శలు ఇతర పక్షాల నుంచి రావడానికి కారణం అయ్యాయి. అదే సమయంలో… సిద్దిపేటలో గంటన్నర… కామారెడ్డిలో గంటన్నర పాటు ప్రసగించారు. ఆయన టూర్ మొత్తం ఆరేడు గంటలు సాగితే.. అందులో మూడు గంటల పాటు రెండు చోట్ల ప్రసంగాలకే సరిపోయింది. ఎప్పట్లాగే తెలంగాణ ఉద్యమం దగ్గర్నుంచి సమైక్య కష్టాలు.., బంగారు తెలంగాణ దిశగా తాను తీసుకుపోతున్న వైనాన్ని తనదైన చురుక్కులు.. చమక్కులతో సుదీర్ఘంగా అలా చెప్పుకుంటూ పోయారు.

సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు వరాలు ప్రకటించారు. అయితే కేసీఆర్ అలాంటి వరాలు ఎప్పుడూ ప్రకటిస్తూంటారు కాబట్టి.. అలాంటి వరాలేనని అందరూ లైట్ తీసుకున్నారు. కేసీఆర్ సీఎం అయినతర్వాత జిల్లాల పర్యటనలు చాలా స్వల్పంగా జరిగాయి. జిల్లాల పునర్విభజన తర్వాత చాలా జిల్లాల్లో ఆయన పర్యటించనే లేదు. ఎన్నికల ప్రచారసభల కోసం వెళ్లడమే తప్ప… అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లలేదు. ఇప్పుడు… అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలు ఒకే చోట ఉండేలా… నిర్మాణాలు కట్టారు కాబట్టి.. వాటిని ప్రారంభించేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కానీ..అందులో ప్రత్యేకత లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెంగళూరు రేవ్ పార్టీ…వారిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా..? ఈ విషయంలో మొదట దూకుడుగానే స్పందించిన బెంగళూరు పోలీసులు ఆ తర్వాత సైలెంట్ కావడానికి...

గేమ్ ఛేంజ‌ర్‌లో ‘జ‌న‌సేన‌’?

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఇదో పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్ర‌కు రాజ‌కీయ...

తొలిసారి మీడియా ముందుకు ‘క‌ల్కి’

ఈ యేడాది విడుద‌ల కాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టుల‌లో 'క‌ల్కి' ఒక‌టి. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ సినీ లోకం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ చిత్రానికి...

పూరి… హీరోల లిస్టు స్ట్రాంగే!

త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేయాల‌న్న విష‌యంపై పూరి జ‌గ‌న్నాథ్ పెద్ద‌గా ఆలోచించ‌డు. ఎందుకంటే పూరి స్టామినా అలాంటిది. త‌ను ఫ్లాపుల్లో ఉన్నా ఎవ‌రికీ లొంగ‌డు, భ‌య‌ప‌డ‌డు. ఇండ‌స్ట్రీలో ఉన్న ఏ హీరోతో అయినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close