నాడు మర్కజ్ – నేడు కుంభమేళా ..!

గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో అందరూ మర్కజ్ వైపే వేళ్లు చూపించారు. అక్కడ విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేయడం వల్లనే కరోనా వ్యాప్తి చెందిందని… అక్కడ ప్రార్థనలు చేసిన వారు దేశవ్యాప్తంగా సంచరించడం వల్ల వైరస్ పాకిపోయిందని విమర్శించారు. ఆ మర్కజ్‌పై ప్రభుత్వంపై ఎన్నో ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు ఆ విషయం అందరూ మర్చిపోయారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో.. మర్కజ్‌తో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువ జనం పోగవుతున్న కార్యక్రమం కుంభమేళా. తొలి రోజే ముఫ్పై లక్షల మంది గంగ స్నానాలు చేశారు. ఇంకా లక్షల మంది కుంభమేళాకు వెళ్తున్నారు.

అయితే .. అక్కడ నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందని వెళ్లవద్దని… ఎవరూ ప్రచారం చేయడం లేదు. దీంతో సమస్య ప్రారంభమయింది. కుంభమేళా నుంచి పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. నాగ సాధువులే కరోనా బారిన పడుతున్నారు. ఇక సామాన్య భక్తుల సంగతి చెప్పాల్సిన పని లేదు. కోవిడ్ నెగెటివ్ వచ్చిన వాళ్లే వారణాశికి రావాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది కానీ.. అదంతా మాట వరుసకే. ఇప్పటికే కర్ణాటక వంటి రాష్ట్రాలు.. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వాళ్లు ఖచ్చితంగా టెస్టులు చేయించుకుని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచనలు చేస్తున్నాయి.

ఇతర రాష్ట్రాలు అసలు పట్టించుకోవడం లేదు. ఈ సారి మర్కజ్ కన్నా దారుణంగా సూపర్ స్ప్రెడర్‌గా… కుంభమేళా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే మర్కజ్ విషయంలో విపరీతంగా ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు మాత్రం. అవగాహన కల్పించడంలో విఫలం అవుతోంది. దీంతో సహజంగానే మతం రంగు పులుముకుంటోంది. ముస్లింలకు సంబంధించిది కాబట్టే.. మర్కజ్‌పై రచ్చ చేశారని.. హిందువులది కాబట్టే.. కుంభమేళాపై మాట్లాడటం లేదని చర్చలు జరుగుతున్నారు. కానీ కరోనాకు హిందూ… ముస్లిం తేడా లేదనే సంగతిని అందరూ గుర్తించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close