తర్వాత వివాదం … స్కూళ్ల రంగులు..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్కూళ్లకు నిర్వహిస్తున్న నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. మిగతా విషయాలు ఎప్పుడూ చెప్పేవే కానీ.. కొత్తగా ఒకటి చెప్పారు… చెప్పారు అనడం కంటే.. ఆదేశించారు అనడం కరెక్ట్. స్కూళ్లకు “ఆహ్లాదమైన రంగులు” ఉండాలి అనేది ఆ అదేశం. దీంతో అధికారులకు బల్బ్ వెలిగి ఉంటుంది. వెలగని అధికారులకు తర్వాత వెలిగేలా చేస్తారు.. అందులో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధినేతకు.. “ఆహ్లాదమైన రంగులు” అంటే…. తన పార్టీ రంగులు మాత్రమే. ఆ విషయం ఇప్పటికి అనేక సార్లు రుజువు అయింది. ప్రభుత్వ భవనాలకు వేసిన ఆహ్లాదకరమైన రంగులు ఎంత వివాదాస్పదం అయ్యాయో.. చూస్తూనే ఉన్నాం.

వైసీపీ అధినేతకు.. రంగుల పై అంత ఇష్టం ఎందుకో కానీ.. వైసీపీ రంగలలను.. కరెంట్ పోల్స్ సహా అన్నింటికీ పులిమేయించారు. దిశ చట్టం రాకుండానే ఏర్పాట్లు చేసిన దిస పోలీస్ స్టేషన్టలకు.. కొన్ని చోట్ల దాతలు నిధులిచ్చారు. ఆ పోలీస్ స్టేషన్లకు కూడా.. బులుగు రంగు పూయించారు. ఇక అంబులెన్స్‌ల గురించి చెప్పాల్సిన పని లేదు. నేషనల్ అంబులెన్స్ కోడ్‌ను కూడా పట్టించుకోకుండా.. రంగులేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై రేపో మాపో.. ఎవరైనా కోర్టుకు వెళ్తే.. ప్రజా ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి.. తీవ్రమైన హెచ్చరికలు వస్తాయన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో ఉంది.

తాజాగా.. జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ప్రకారం..”ఆహ్లాదమైన రంగులు” స్కూళ్లకు కూడా వేయడం ఖాయమే. నాడు-నేడు పేరుతో.. ఇప్పటికీ పలు రకాల అభివృద్ధి పనులను స్కూళ్లకు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఆ లోపు రంగులు కూడా వేసేస్తారన్నమాట. రంగులు ఇంకా ఖరారు చేయలేదు. ఖరారు చేసినా.. వేసే వరకు బయట పెట్టారు. వేసిన తర్వాత మాత్రమే… అది “మ్యాటర్” అవుతుంది. అంటే.. మరో వివాదం కోసం అలా ఎదురు చూడాల్సిందేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close