ఇళ్ల స్థలాల పంపిణీని టీడీపీనే అడ్డుకుందన్న జగన్..!

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వరుసగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలపై టీడీపీ కోర్టుకెళ్లిందని..అందుకే.. వాయిదా పడిందని.. చెప్పడం ప్రారంభించారు. డి-పట్టాల రూపంలో ఇవ్వాలనుకుంటే ఈరోజే ఇవ్వొచ్చని .. కానీ రిజిస్ట్రేషన్‌ చేసి ఆస్తి రూపంలో ఇవ్వాలని భావించామని జగన్ చెబుతున్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం 62 వేల ఎకరాలు సేకరించామని రూ.7,500 కోట్లు ఖర్చు చేశామన్నరాు. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తుందని .. ఆగస్టు 15న పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తన్నామని ప్రకటించారు.

నిజానికి సుప్రీం కోర్టులో ఇళ్ల స్థలాలపై పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వమే. ప్రభుత్వం పేదలకు ఇచ్చే స్థలాలు అమ్ముకునే అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయితే ప్రభుత్వం మాత్రం… నిబంధనలకు విరుద్ధమైనా సరే.. పేదలకు ఇచ్చే స్థలాలు వారు అమ్ముకోవచ్చంటూ… జీవో నెంబర్ 44 విడుదల చేసింది. ఈ జీవో 44నే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇది విచారణకు రావాల్సి ఉంది. అయినప్పటికీ.. వైఎస్ జయంతి రోజున.. ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ ప్రకటనలు చేసేశారు. రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా రెడీ చేశారు.

అయితే.. సుప్రీకోర్టులో కేసు విచారణకు రాకుండా.. హైకోర్టు జీవోను కొట్టివేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలు పంపిణీ చేస్తే కోర్టు ధిక్కారం అవుతుందన్న ఉద్దేశంతో చివరి క్షణంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. సుప్రీంకోర్టులో అయినా… అసైన్డ్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న 44వ జీవోకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం లేదని.. న్యాయవర్గాలే చెబుతున్నాయి. దీంతో.. మళ్లీ డీ -పట్టాల రూపంలోనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేసినా.. ఆగిపోతే.. టీడీపీ పై నెట్టేస్తే పనైపోతుందని.. వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. నిన్నటి నుంచి వైసీపీ నేతలు టీడీపీ నేతలు అడ్డుకున్నారనే వాదనను వినిపించడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close