మోడీకి ఇకనైనా కనువిప్పు కలిగేనా..?

తప్పులో కాలేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా లేదా అనేదే ఇప్పుడు దౌత్య నిపుణులు చర్చిస్తున్న తాజా అంశం. ప్రపంచమంతా వేరు. పాకిస్తాన్ వేరు. అక్కడ పైకి కనిపించే ప్రభుత్వం నామమాత్రం. తెరవెనుక చక్రం తిప్పే ఆర్మీనే పవర్ ఫుల్. అది తయారు చేసిన ఐఎస్ఐ అనే భూతం అనుక్షణం భారత్ పై విషం చిమ్మడానికే ప్రయత్నిస్తుంది. ఉగ్రవాద తండాలకు ఆశ్రయం ఇస్తుంది. టెర్రర్ క్యాంపులు పెట్టి శిక్షణనిస్తుంది. తుపాకులు, డబ్బులు సమకూరుస్తుంది. పఠాన్ కోట్ దాడి ఇందులో భాగమే.

పఠాన్ ఎయిర్ బేస్ లో దాడి చేసింది పాక్ పాలు పెంచి పోషించే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. ఈ దర్యాప్తులో భాగంగా పఠాన్ కోట్ లో పర్యటించిన పాక్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ బృందం చివరకు ఐఎస్ఐ తరహాలోనే అబద్ధాలతో రిపోర్టు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

అసలు పఠాన్ కోట్ దాడి అనేది భారత్ సృష్టించిందే అని పాక్ బృందం అభిప్రాయానికి వచ్చిందట. పాక్ వ్యతిరేకంగా భారత్ సరైన ఆధారాలను ఇవ్వలేదట. ఈ విషయాలను పాక్ మీడియా వెల్లడించింది. తమ దేశాన్ని బద్నాం చేయడానికి భారత్ పఠాన్ కోట్ దాడి పేరుతో డ్రామా ఆడిందంటూ ఆ బృందం అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందట.

ఇంతకన్నా పచ్చిదగా మరొకటి ఉండదు. నాలుగు రోజులు హాయిగా ఢిల్లీ, పంజాబ్ లలో తిరిగి, బిర్యానీలు తిని తీరా తప్పుడు నివేదిక ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్లను ఏమనాలి? వాళ్లు పుట్టిన దేశం ఎంత నీచమైందో, వీళ్లూ అంతే నీచంగా ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ అనే దుష్ట దేశంతో చర్చలు గత 67 ఏళ్లుగా నడుస్తున్నాయి. ఏనాడూ ఓ కొలిక్కి రాలేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అనేది పాకిస్తాన్ విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఈ వాస్తవాన్ని ప్రధాని మోడీ విస్మరించారు. గత డిసెంబర్లో కాబూల్ నుంచి ఢిల్లీ వస్తూ హటాత్తుగా లోహోర్ లో దిగారు. అందరినీ ఆశ్చర్యపరిచారు.

అది అతి ఘోరమైన చారిత్రక తప్పిదమని చాలా మంది అప్పుడే విమర్శించారు. అయినా అది సృజనాత్మక దౌత్యమంటూ కమలనాథులు కోరస్ పలికారు. పాక్ బృందం దర్యాప్తుకి భారత్ రావడానికి అనుమతి ఇవ్వడం ఏమిటి? మన ముంబై దాడి, పఠాన్ కోట్ దాడి దర్యాప్లులో భాగంగా మర అధికారులను పాక్ రానిచ్చిందా? ఈమాత్రం ఆలోచన లేకుండా పోలోమని అనుమతినిచ్చారు. ఇప్పుడు ఆ బృందమే పచ్చిదగా చేసింది.

పాక్ తో వ్యవహారం ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. కర్కషంగానే ఉండాలి. సాక్ష్యాలు ఆధారాలు పంపుతూ టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేం లాడెన్ జాడ విషయంలో పాకిస్తాన్ కు ఆధారాలు ఇచ్చామా? మేమే పని పూర్తి చేశాం భారత్ కూడా అదే పని చేయవచ్చు కదా అని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆ మధ్య వ్యాఖ్యానించారు. అది అక్షర సత్యం. పాక్ తో మాటలు కాదు, తూటాలతోనే మాట్లాడాలి. అలాగని, నేరుగా యుద్ధానికి దిగలేం. యుద్ధం చేయకపోయినా, యుద్ధం చేసినంత పని చేయవచ్చు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాకిస్తాన్ కుమాత్రమే చేతనవుతుందా? మనకు చేతకాదా? లాడెన్ ను అబోటాబాద్ లో అంతం చేసిన అమెరికా తరహాలోనే మనమూ స్కెచ్ వెయ్యలేమా? మన దేశంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఆటను పాక్ లోనే కట్టించడానికి ప్లాన్ చెయ్యలేమా? ఈ దిశగా మోడీ ప్రభుత్వం ఆలోచించాలనేది కొందరు దౌత్య నిపుణుల సూచన. మరి మోడీ ఏం చేస్తారో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close