పాత క‌థ‌ల‌కు రిపేర్లు చేస్తున్న ప‌ర‌శురామ్‌

ఆలస్య‌మైనా, తాను అనుకున్న హీరోనే ప‌ట్టుకోగ‌లిగాడు ప‌ర‌శురామ్‌. గీత గోవిందం త‌ర‌వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ వ‌చ్చింది ప‌ర‌శురామ్‌కి. ఈమ‌ధ్య‌లో మ‌హేష్‌తో సినిమా చేద్దామ‌నుకున్నాడు. ఓ క‌థ కూడా చెప్పాడు. కానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. హీరోలెవ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డంతో నాగ‌చైత‌న్య‌తో స‌ర్దుకున్నాడు. ఈసినిమా స్క్రిప్టు ప‌నుల్లో బిజీగా ఉన్న‌ప్పుడు.. మ‌ళ్లీ మ‌హేష్ నుంచి పిలుపొచ్చింది. వంశీ పైడిప‌ల్లి సినిమా ప‌క్క‌న పెట్టేయ‌డం వ‌ల్ల‌… అనుకోకుండా వ‌చ్చిన గ్యాప్‌ని ఫిల్ చేయాల్సిన బాధ్య‌త ప‌ర‌శురామ్‌పై ప‌డింది.

ఇప్ప‌టికిప్పుడు మ‌హేష్ కోసం ప‌ర‌శురామ్ కొత్త క‌థ రాయ‌డం క‌ష్టం. అందుకే పాత క‌థ‌కే కాస్త రిపేర్లు చేస్తున్నాడ‌ట‌. ఇది వ‌ర‌కు మ‌హేష్‌కి చెప్పి, నో అనిపించుకున్న క‌థ‌నే కాస్త అటూ ఇటూ చేసి మ‌ళ్లీ ట్రాక్ ఎక్కించే ప‌నిలో ఉన్నాడు ప‌ర‌శురామ్‌. `గ‌తంలో నాకు చెప్పిన క‌థే చేద్దాం. కాక‌పోతే… ఈసారి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు డైలాగ్ వెర్ష‌న్‌తో రండి`అని చెప్పాడ‌ట మ‌హేష్‌. అందుకే ఈసారి శ్రీ‌కారం నుంచి శుభం కార్డు వ‌ర‌కూ ప‌క్కా బౌండెడ్ స్క్రిప్టుతోనే మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయ్యాడు ప‌ర‌శురామ్‌. మ‌హేష్ సినిమా ఓకే అయిన ప‌క్షంలో నాగ‌చైత‌న్య సినిమాని కొన్నాళ్లు ప‌క్క‌న పెట్టాల్సివ‌స్తుంది. మ‌రి చైతూ ఈ విష‌యంలో ప‌ర‌శురామ్‌కి ఎలా స‌హ‌క‌రిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close