ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు. తెలంగాణలో ఏకంగా బీజేపీ సీఎం అభ్యర్థిని అని ప్రచారం చేయించుకున్న ఆయన.. ఏపీలో మాత్రం.. హిందూపురం ఎంపీ అభ్యర్థి దగ్గరే ఆగిపోయారు . కానీ బీజేపీ నుంచి ఆ ఎంపీ అభ్యర్థిత్వం కూడా దక్కలేదు. చివరికి రెబల్ ని అవుతానని ప్రకటించేస్తున్నారు.

పొత్తు ఉంటుందని.. ఖచ్చితంగా హిందూపురం ఎంపీ సీటు బీజేపీకి వస్తుందని ఆయన ఆరు నెలల ముందే హిందూపురం చేరుకుని.. అక్కడే క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తిరుగుతున్నారు. అయితే టిక్కెట్ రాలేదు. ఈ కారణంగా తాను బరిలో ఉంటానని.. తనకు టిక్కెట్ రాకపోవడానికి బాలకృష్ణే కారణమని ఆరోపిస్తున్నారు. పొత్తు కుదరక ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేస్తానని బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేశానని.. దానికి అనుగుణంగానే బిజెపి అధినాయకత్వం కూడా తనవైపు మొగ్గు చూపిందని పరిపూర్ణానందచెబుతున్నారు. కానీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ వత్తిడి వల్లే పార్లమెంట్ అవకాశం తనకు ఇవ్వకుండా చేశారన్నారు.

హిందూపురంలో మైనార్టీ ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయని బిజెపికి పార్లమెంటు సీటు ఇవ్వడం వలన మైనార్టీ ఓట్లు టిడిపికి పడవని దీంతో తన గెలుపు కష్టమవుతుందని బాలకృష్ణ భావించి తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని పరిపూర్ణానంద స్వామీజీ ఆరోపించారు. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు బాలకృష్ణ ఒత్తిడి మేరకే హిందూపురం టికెట్ తనకు దక్కకుండా పోయిందని వెల్లడించారు. తనకు బిజెపి టికెట్ దక్కకపోయినా పోటీ నుంచి విరమించే ప్రసక్తే లేదంటూ చెబుతూనే హిందూపురం పార్లమెంటు నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేశారు. అయితే ఆయనను కూటమి పార్టీలు సీరియస్ గా తీసుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close