మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణే. ప్యాకేజీకి రూపకల్పన చేసింది మోడీ, నిర్మలా సీతారామన్ కాబట్టి వారికి నమ్మకం ఉండటంలో తప్పు లేదు.. మరి పవన్ కల్యాణ్‌కు అంత నమ్మకం ఎలా వచ్చిందో తెలియదు కానీ.. తన నమ్మకాన్ని ఆయన .. మోడీ రెండో సారి ప్రధానిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా…సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని పవన్ ప్రకటించేశారు. రెండో సారి ప్రధానిగా పదవి చేపట్టిన ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని జనసేనాని పొగడ్తల వర్షం కురిపించారు. త్వరలోనే భారత్‌ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్దం భారత్‌దేనని చెప్పారు. ముందు చూపు, ధైర్యసాహసాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అది సాధ్యం అవుతుందన్నారు.

స్వచ్చభారత్, భారత్‌లో తయారీ వంటి పలు టైటిల్స్‌తో గతంలో మోదీ కార్యక్రమాలు ప్రారంభించారు. తాజాగా … నిర్భర ప్యాకేజీతో ..స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. భారత్‌లో తయారైన బ్రాండ్లను మాత్రమే వాడాలని పిలుపునిచ్చారు. ఇది ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్లిందో కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం.. స్వావలంబన సాధ్యమని గట్టిగా నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close