తిరుపతి సీటు కోసం ఢిల్లీకి పవన్, నాదెండ్ల ..!

బీజేపీకి మద్దతుగా గ్రేటర్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపేందుకు నాదెండ్ల మనోహర్‌తో కలిసి హస్తినకు వెళ్తున్నారు. నడ్డా అపాయింట్‌మెంట్లు ఇప్పటికే ఖరారయినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత బీజేపీ హైకమాండ్ విజ్ఞప్తి మేరకు పోటీ నుంచి వైదొలిగారు. నాదెండ్ల మనోహర్ ఇంట్లో జరిగిన చర్చల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ.. ఢిల్లీ నుంచి హైకమాండ్ పెద్దలు చేసిన సూచనలు.. ఇచ్చిన హామీల మేరకే.. పోటీ నుంచి విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఇప్పుడు.. ఆ మేరకు తదుపరి చర్చల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ ఉంది. ఢిల్లీలో జరిగిన చర్చలను బట్టి .. పవన్.. గ్రేటర్‌లో ఒకటి రెండు రోజులు ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో వారి ఎజెండాలో ప్రధానంగా ఏపీ రాజకీయ వ్యవహారాలు ఉండే అవకాశం ఉంది. తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. హైదరాబాద్ లో పోటీ చేయడం లేదు కనుక.. తిరుపతిలో తాము పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ అంశంపై నడ్డాతో చర్చించి.. తమకే ఆ సీటును ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. గతంలో బీజేపీతో పొత్తు ప్రకటన కోసం.. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. చాలా రోజుల తర్వాత మళ్లీ వెళ్తున్నారు. ఏమైనా కీలక పరిణామాలు ఉంటాయేమోనని.. జనసైనికులు ఆసక్తిగా చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close