అమరావతిని తరలిస్తున్నట్లుగా అధికారికంగా చెప్పలేదా జనసేనాని..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎప్పుడో ఒక సారి అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తున్నారు. వారు వచ్చిన కలిసినప్పుడో.. లేకపోతే తాను అమరావతి వెళ్లినప్పుడో ఆ ప్రకటనలు చేస్తున్నారు తప్ప.. వారికి మద్దతుగా ఉద్యమంలోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. కీలకమైన సందర్భాల్లో మాట సాయం కూడా ఉండటం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు మార్చ్ అని.. మరొకటని ప్రకటించారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. అందుకే.. బీజేపీతో కలిసి రైతుల్ని మోసం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన కూడా అలానే వివాదాస్పదం అవుతోంది.

రాజధాని తరలిస్తున్నామని ప్రభుత్వం ఆన్‌రికార్డ్‌గా చెప్పలేదని పవన్‌ చెప్పుకొస్తున్నారు. అధికారికంగా చెప్పిన తర్వాత జనసేన కార్యచరణ ఉంటుందని రైతులకు తెలిపారు. ఆన్ రికార్డ్ .. అధికారికం అంటే ఏంటో పవన్ కల్యాణ్‌ కు తెలియదమో అన్న సెటైర్లు పడుతున్నాయి. ఇప్పటికే బిల్లులు ఆమోదించేసుకున్నారు . గవర్నర్ కూడా సంతకం పెట్టేశారు. అది ఆన్ రికార్డ్ కాదా అనే సందేహం.. పవన్ మాటలు విన్నవారికి వచ్చింది. రైతులు న్యాయపోరాటం చేస్తున్నారు.. ఏ మాత్రం సందు దొరికినా… రాజధానిని తరలించాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అయినా పన్ కల్యాణ్… అధికారికంగా చెప్పలేదని..చెప్పిన తర్వాత కార్యాచరణ ఖారారు చేసుకుంటానంటున్నారు.

అయితే తనను కలిసిన రైతులకు మాత్రం.. తనదైన శైలిలో ధైర్యం చెబుతున్నారు. రైతులకు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఖండించారు. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా?…ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ స్పష్టం చేసిందని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close